ప్రజా సంకల్పయాత్రలో ప్రశాంత్‌కిషోర్ టీం హల్‌చల్

వైకాపా వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ టీం ప్రజా సంకల్పయాత్రలో హల్‌చల్ చేస్తోంది. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర మొత్తాన్ని టీం సభ్యులు వీడియోల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేక వాహనంలో వచ్చిన పికె బృందం సభ్యులు వీడియో కెమెరాలతో ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించడం కనిపించింది. నలుపురంగు టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించిన పికె బృందం సభ్యుల్లో కొంతమంది వాహనం పైనుంచి పాదయాత్రను కవర్‌చేయగా మరికొంత మంది జనం మధ్యకు వెళ్లి చిత్రీకరించడం కనిపించింది. ఇదిలా ఉండగా ప్రశాంత్‌కిశోర్ సైతం యాత్రను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఎలాగూ సాక్షి టివి బృందం మొత్తం యాత్రని కవర్ చేస్తూ వీడియో తీస్తుంది. సాక్షి లో రోజూ వస్తోన్న ప్రోగ్రాంస్ లో వీటంతటి ఫూటేజ్ ఉంటుంది కూడా. మరి పీకే టీం సపరేట్ గా వీడియోళూ చిత్రించడం దేనికి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. విషయానికొస్తే, అసలే ప్రశాంత్ కిశోర్ అంటేనే సోషల్ మీడియాని మేనేజ్ చేయడం లో దిట్ట. సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేయడం లోనూ, దాన్ని ట్రెండింగ్ చేయడం లోనూ ఆయనది అందె వేసిన చేయి. బహుశా ఇప్పుడు ఈ పాదయాత్ర వీడియోలన్నీ కొద్ది రోజుల్లో వేర్వేరు హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో అప్ లోడ్ అవుతాయి కాబోలు. ఆ పై వాటిని ట్రెండింగ్ చేయడం పీకే కి చిటికెలో పని.మరి ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కి అప్పుడు ప్రజలెలా స్పందిస్తారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.