సలార్ డ్రామా… అదే పెద్ద టెన్షన్!

ఒక సినిమాకి జోనర్ సెట్ చేయడం చాలా ముఖ్యం. ఏ జోనర్ సినిమా అనేది ప్రేక్షకులకు క్లియర్ గా తెలియాలి. అందుకే సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడే ప్రెస్ నోట్ లో చాలా క్లియర్ గా ఈ సినిమాలో ఏ జోనర్ లో వుండబోతుందనేది చెబుతారు. కొన్ని సినిమాలు మాత్రం విడుదలకు సిద్ధమైనంత వరకూ ఆ సినిమా జోనర్ ఏమిటనేది ప్రేక్షకులకు క్లారిటీ వుండదు. దీనికి వెనుక ప్రమోషన్ మెటిరియల్ రాకపోవడం, ఉప్దేట్స్ లేకపోవడం, ప్రోపర్ గా పీఆర్ వర్క్ జరక్క పోవడం.. ఇలా చాలా కారణాలు వుంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా ఎదురుచూస్తున్న ‘సలార్’ సినిమాకి కూడా ఇదే పరిస్థితి ఎదురైయింది.

సలార్ టీజర్ ట్రైలర్ చూసి ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ సినిమా అనుకోని అలాంటి కీ వర్డ్స్ తోనే ఆర్టికల్స్ వచ్చాయి. ప్రెస్ నోట్స్ లో కూడా ఈ సినిమా జోనర్ ని యాక్షన్ థ్రిల్లర్ అనే చెప్పారు. వికీపిడియాలో కూడా యాక్షన్ థ్రిల్లర్ అనే వుంది. అయితే ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ పెద్ద బాంబ్ పేల్చాడు. సలార్ జోనర్ ‘డ్రామా’ అని ఒకటికి పదిసార్లు చెప్పాడు ప్రశాంత్ నీల్.

రాజమౌళితో జరిగిన ఇంటర్వ్యూలో తొలి పదినిమిషాలు ఈ సినిమా జోనర్ గురించే వుంది. ‘సలార్.. ఒక మంచి డ్రామా. కానీ అది ట్రైలర్ సరిగ్గా చెప్పలేకపోయాననిపిస్తుంది. ఈ విషయంలో నాకు చాలా టెన్షన్ వుంది. ఆ ట్రైలర్ ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అయ్యిందో తెలీదు. ఖాన్సర్ చుట్టూ ఒక బలమైన డ్రామా వుంది. ప్రభాస్, పృద్వీరాజ్, శ్రుతి హసన్, ఈశ్వరి రావు, జగపతి బాబు.. ఇలా ఐదు పాత్రల చుట్టూ నడిచే డ్రామా ఇది” అని చాలా క్లారిటీగా చెప్పారు ప్రశాంత్ నీల్.

ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సలార్ ని డ్రామా మూవీగానే ట్రీట్ చేయాలని చెప్పాడు. ‘నా ద్రుష్టిలో సలార్ గేమ్ ఆఫ్ త్రోన్స్ తరహా డ్రామా. చాలా పాత్రలు వుంటాయి, వాటి చుట్టూ వున్న కోర్ ఎమోషన్, డ్రామా ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఇందులో ప్రతి పాత్రని ప్రశాంత్ నీల్ రాసుకున్న విధానం నాకు సర్ప్రైజ్ ఇచ్చింది” అని చెప్పుకొచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close