వర్మ, వైసీపీ పంతానికి ఈ రెండు ధియేటర్లు క్లోజ్..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించినందుకు రెండు ధియేటర్లు మూత పడబోతున్నాయి. ఇలా మూత పడేది.. కలెక్షన్లు లేక కాదు.. రామ్ గోపాల్ వర్మ తరహా రెటమతం చూపించినందుకు. అన్నీ తెలిసి… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించిన రెండు ధియేటర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సినిమాపై నిషేధం ఉన్నా.. అడ్డుకోలేకపోవడంతో.. కడప జాయింట్ కలెక్టర్ పై.. ఈసీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమయింది. బయోపిక్‌లపై.. ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కౌంటింగ్ ముగిసే వరకూ.. రాజకీయ నేతల బయోపిక్ లు విడుదల చేయకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 

అయితే…  రామ్‌గోపాల్ వర్మ మాత్రం.. తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేస్తానని పట్టు బట్టారు. ఈసీకి ఆయన లేఖ రాసి.. విడుదల చేస్తున్నట్లు ప్రకటించేసుకున్నారు. అయితే.. ఈసీ రూల్స్ రూల్సేనని చెప్పడంతో.. విడుదలకు ఆటంకం ఏర్పడింది. అయితే.. ఏం జరుగుతుందో.. చూద్దాం అనుకున్నారో కానీ … ధియేటర్లకు క్యూబ్ లు పంపించేశారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ధియేటర్ల యజమానాలు మాత్రం.. ప్రదర్శించడానికి వెనుకడుగు వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షో వేయాలన్న పట్టదలతో..కడప,పోరుమామిళ్లలోని…వైసీపీ నేతలకు చెందిన రెండు ధియేటర్లలో మాత్రం షో వేశారు. 

దీనిపై…ఫిర్యాదులు వెళ్లడంతో.. ఈసీ సీరియస్ అయింది.  చట్టాన్ని ఉల్లంఘించి సినిమాలు ప్రదర్శించినందుకు… ధియేటర్ల లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు. పట్టించుకోవాల్సిన జాయింట్ కలెక్టర్  లైట్ తీసుకోవడంతో.. ఆయనపైనా చర్యలు తీసుకోబోతున్నారు. మరికొన్ని చోట్ల కూడా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ షో పడిందనే ప్రచారం జరుగుతోంది. వీటిపైనా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close