రఘురామను బీజేపీ ఎందుకు వద్దనుకుంది !?

రఘురామకృష్ణ రాజు తన రాజకీయ జీవితంలో బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. పైగా మోదీని ఆయన పొగుడుతూనే ఉంటారు. బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ ఆయనకు రెండో సారి బీజేపీ హ్యాండిచ్చింది. 2014 ఎన్నికల సమయంలోనూ ఆయన నర్సాపురం నుంచి పోటీకి బీజేపీ తరపున ఏర్పాట్లు చేసుకుంటే… పొత్తులో భాగంగా సీటు వచ్చినా… గోకరాజు గంగరాజుకు సీటిచ్చారు. తర్వాత ఆయన తప్ప ఆయన కుటుంబీకులంతా వైసీపీలో చేరిపోయారు.

ఇప్పుడు మరోసారి అలాగే.. రఘురామకు హ్యాండిచ్చారు. నర్సాపురంలో రఘురామ కన్నా పొటెన్షియల్ క్యాండిడేట్ ఎవరు ఉంటారు ?.. కానీ ఉద్దేశపూర్వకంగా ఆయనకు టిక్కెట్ దక్కనివ్వకూడదన్న లక్ష్యంతో అందరూ కలిసి ఆయనను దూరం పెట్టారు. ఆయనపై ఎందుకు అంత వ్యతిరేకత ?. జగన్ అరాచకాలపై ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. దానికే వ్యతిరేకత పెంచుకుంటారా ?. జగన్ పై పోరాడితే బీజేపీ నేతలకు ఎందుకు నొప్పి ? అనేది చాలా మందికి అర్థం కాని విషయం.

వైసీపీ వద్దనుకున్న వరప్రసాద్ కు పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు. ఉదయం పార్టీలో చేర్చుకుని మధ్యాహ్నానికి టిక్కెట్ ఇచ్చారు. మరి జగన్ పై పోరాడుతున్న రఘురామకు ఎందుకివ్వలేదు. ?. ఆ సీటు కూటమిలో భాగంగా టీడీపీకే వదిలి పెడితే… వారే ఇచ్చుకునేవారు కదా !. తాము గతంలో గెలిచిన సీటు అని పట్టుబట్టి ఎందుకు తీసుకున్నారు ? . ఇదంతా జగన్ పై పోరాడినదానికి ఆయన పడుతున్న కష్టమే. కానీ రఘురామ మాత్రం జగన్ ను వదిలి పెట్టే ప్రశ్నే ఉండదని అంటున్నారు.

https://x.com/telugu360/status/1771926830640992262?s=46

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close