మెగా హీరోకే గురిపెట్టాడు

అహ‌నా పెళ్లంట, పూల రంగ‌డు సినిమాల‌తో అద‌ర‌గొట్టాడు వీర‌భ‌ద్ర‌మ్‌. భాయ్ పూర్తిగా నిరాశ ప‌రిచింది. నాగార్జున ఇచ్చిన అవ‌కాశాన్ని వీర‌భ‌ద్ర‌మ్ క్యాష్ చేసుకోలేక‌పోయాడు. మ‌ళ్లీ మ‌రో హీరోని ప‌ట్టుకొని సినిమా ప‌ట్టాలెక్కించి విడుద‌ల చేయ‌డానికి చాలా టైమ్ తీసుకొన్నాడు. ఈ శుక్ర‌వారం వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన చుట్టాల‌బ్బాయ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఆది ఎట్టిప‌రిస్థితుల్లోనూ హిట్ కొట్టాల్సిన త‌రుణ‌మిది. వీర‌భ‌ద్ర‌మ్ కీ… ఓ హిట్టు అత్య‌వ‌స‌రం. అందుకే వీరిద్ద‌రూ దీనిపై బోల్డంత భ‌రోసా పెట్టుకొన్నారు. కామెడీ సినిమాలు బాగా వ‌ర్క‌వుట్ అవుతున్న త‌రుణ‌మిది. ఆ ప‌ల్స్ తెలిసిన వీర‌భ‌ద్ర‌మ్.. ఎక్కువ‌గా కామెడీపైనే గురి పెట్టాడ‌ట‌. ఇక మీద‌ట ఎలాంటి గ్యాప్ రాకుండా చ‌క చ‌క సినిమాలు చేస్తానంటున్నాడు వీర‌భ‌ద్ర‌మ్‌. త‌దుప‌రి సినిమా కోసం అప్పుడే ఇద్ద‌రు నిర్మాతల ద‌గ్గ‌ర అడ్వాన్సు కూడా తీసుకొన్నాడ‌ట‌.

అయితేఈసారి ఓ మెగా హీరోకి గురిపెడుతుండ‌డం విశేషం. సాయిధ‌ర‌మ్ తేజ్ కోసం ఓ క‌థ రెడీ చేసుకొన్నాడట ఈ ద‌ర్శ‌కుడు. చుట్టాల‌బ్బాయ్‌కి పాజిటీవ్ టాక్ వ‌స్తే.. మెగా హీరోతో కాంబినేష‌న్ దొర‌డం ఖాయం. అయితే.. సాయి అంత తేలిగ్గా దొరికే ర‌కం కాదు. చేతిలో బోల్డ‌న్ని సినిమాలున్నాయి. వీరు వంతు రావాలంటే క‌నీసం యేడాదైనా ఆగాలి. నిజంగా.. చుట్టాల‌బ్బాయ్ సూప‌ర్ హిట్ అయితే ఈ స‌మీక‌ర‌ణాలు మారిపోవొచ్చు. ఫ్లాప్ అయితే.. అస‌లు వీరు క‌థే విన‌క‌పోవొచ్చు. ఏం జ‌ర‌గాల‌న్నా… చుట్టాల‌బ్బాయ్ వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close