కొత్తేముంది.. షర్మిలను సాక్షిలో ఎప్పుడో బ్యాన్ చేశారుగా !?

సాక్షి పత్రికలో షర్మిల ఫోటోతో ఉన్న ప్రకటనను డబ్బులు తీసుకుని మరీ వేయలేదని ఆరోపిస్తూ పులివెందులకు చెందిన ఓ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కోర్టును కూడా ఆశ్రయించడం హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఆయన ఫిర్యాదులో వైఎస్ భారతి పేరు కూడా ప్రస్తావించారు. భారతి ఆదేశాల మేరకే షర్మిల ఫోటో ఉన్న వైఎస్ జయంతి ప్రకటనను వేయలేదని ఆయన అంటున్నారు. మొత్తానికి ఓ పత్రికలో ప్రకటన వేయాలా వద్దా అన్నది ఆ పత్రిక ఇష్టం. డబ్బులిస్తాం అని ఎవరైనా అంటే.. అన్నీ వేయరు. ఇక్కడ సాక్షికి సాక్షి యజమాని అయిన భారతికి ఆ హక్కు ఉంది.

కానీ పులివెందుల రెడ్డి ఎందుకు కోర్టుకు … పోలీసుల వరకూ వెళ్లారు.. దాన్ని నచ్చని మీడియాకు ఎందుకు లీక్ చేశారన్నది సంచలనంగా మారింది. కేవలం భారతి వల్లే కుటుంబంలో విబేధాలున్నాయని చెప్పేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ఈ ఫిర్యాదు వల్ల ఏర్పడుతోంది. షర్మిలకు సన్నిహితుడైన ఆ రెడ్డి పెద్దల అనుమతి లేకపోతే ఫిర్యాదు చేయరని అంటున్నారు. నిజానికి సాక్షి పత్రికలో షర్మిల పేరుతో ప్రకటనలే కాదు.. ఎప్పుడో వార్తలు కూడా ఆపేశారు. రెండు, మూడేళ్ల కిందట… అప్పట్లో ఫీచర్స్ ఎడిటర్ గా ఉన్న రామ్… షర్మిల పాదయాత్ర కు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు పేజీల ప్రత్యేక ఆర్టికల్ రాయించి రెడీ చేశారు. విషయం తెలిసిన భారతి ఆ ఆర్టికల్ ప్రింటింగ్‌ను ఆపేయించడమే కాదు.. రామ్ కు గుమ్మం చూపించారు. అప్పట్లోనే ఏదో జరుగుతోందని అనుకున్నారు.

ఇటీవల సాక్షిలో ఆమెకు కవరేజీ రావడం లేదు. పార్టీ పెట్టిన తర్వాత పట్టించుకోలేదు. దీనిపై షర్మిల కూడా బహిరంగంగా సెటైర్లు వేశారు. కానీ సాక్షిలో తనకూ వాటా ఉందని షర్మిల కొన్ని ఇంటర్యూలలో చెప్పిన తర్వాత.. ఏవో రాజీ చర్చలు జరిగాయని అనుకున్న తర్వాత ఆమెకు కొంత కవరేజీ ఇస్తున్నారు. ఇటీవల అది కూడా తగ్గిపోయిదని చెబుతున్నారు. మొత్తంగా షర్మిల ఫోటో రావడం ఇష్టం లేకనే ప్రకటన వేయలేదంటూ ఓ వ్యక్తి పోలీసుల ఫిర్యాదు వరకూ వెళ్లడం .. వైఎస్ కుటుంబంలో చిచ్చు అంతకంతకూ కార్చిచ్చు అవుతోందన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

ఓటేస్తున్నారా ? : డ్రగ్స్ క్యాపిటల్ గా మారిన రాష్ట్రం గురించి ఆలోచించండి !

గంజాయి మత్తులో దాడులు... గంజాయిత మత్తులో హత్యలు.. గంజాయి మత్తులో అత్యాచారాలు.. గంజాయి గ్యాంగుల హల్ చల్. ఇవి వార్తలు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ.. ఏపీలో దాదాపుగా ప్రతీ వీధిలో...

ఈనాడు ఇంటర్యూ : ఏపీ వికాసానికి మోదీ గ్యారంటీ

ఎన్నికల సందర్భంగా ఈనాడు పత్రికకు ప్రధాని మోదీ ఇంటర్యూ ఇచ్చారు . ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఇంటర్యూను ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ ఇంటర్యూలో...

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close