“దక్షిణాది” ఉద్యమం ఎంతో దూరం లేదా..!?

“దక్షిణాది నుంచి పన్నులు వసూలు చేయడం.. ఉత్తరాదికి పంపిణీ చేయడం..” బడ్జెట్ ప్రకటన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ వినిపించిన అభిప్రాయం ఇది. పెద్ద ఎత్తున నిధులు.. ఉత్తరాది రాష్ట్రాలకే ప్రవహింప చేశారు. ఎన్నికలున్న కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కొన్ని నిధులు ప్రకటించారు. కానీ గత చరిత్ర చూస్తే..కేటాయింపులు పూర్తిగా ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. దీంతో దక్షిణాది ఎంపీల్లోనూ గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఈ నిరాదరణ ఇంకెంత కాలం అన్న చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ అంశంపై మీడియాతో పిచ్చాపాటిగా మాట్లారు. జమిలీ ఎన్నికలు పెట్టి.. అధ్యక్ష పద్దతిలోకి మార్చాలనుకున్న వ్యూహం బడ్జెట్‌లో కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు.

జమిలీ ఎన్నికలు జరిగితే .. దేశం రెండుగా విడిపోవడం ఖాయమని.. అదే జరిగితే అధ్యక్షడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసం పడవని అంటున్నారు. జమిలి ఎన్నికలు జరగగానే .. దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పారు. అదే జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు .. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని .. మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని గుర్తుచేశారు. ట్యాక్స్ అత్యధికంగా కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారే .. కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయని లెక్కలు చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమీలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని .. లేకుంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్ లోనే మాట్లాడుతానని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్ లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు గతంలో బీహార్ కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు .. ఏమైందని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. రేవంత్ తో పాటు మరికొంత మంది ఎంపీల అభిప్రాయం కూడా అంతే ఉంది. నియామకాలు.. నిధుల్లో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. అయితే దక్షిణాది మొత్తం ఏకమయినప్పుడే… ఇలాంటి పరిణామం సాధ్యమవుతుంది. కానీ ఇక్కడి ప్రజలకు అంత తీరిక ఉందా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ అణిచివేత అధికమయ్యే కొద్దీ తిరుగుబాటు తీవ్రమవుతుందనే నినాదం ఉండనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close