సైనాపై సిద్ధార్థ్ డబుల్ మీనింగ్ ట్వీట్.. రచ్చ రచ్చ !

ప్రధాని మోడీకి పంజాబ్‌లో ఎదురైన ఘటనపై బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. దీన్ని సెటైరిక్‌గా విమర్శిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదం వుతోంది. ఆమెను కాక్ చాంపియన్‌గా పేర్కొనడంతో సమస్య ప్రారంభమయింది. ఇది దారుణంగా ఉందని… ఓ మహిళ పట్ల ఇలాంటి పదాలు ఎలా వాడతారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వివాదాలొస్తే విరుచుకుపడటానికి ముందు ఉండే శ్రీపాద చిన్మయి కూడా సిద్ధార్థపై మండిపడ్డారు.

ఇక సైనా భర్త కశ్యప్ కూడా ఇది మంచి పద్దతి కాదని ట్వీట్ చేశారు. మరో వైపు ఈ వివాదంపై సిద్ధార్థ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. డబుల్ మీనింగ్ ఎందుకు తీసుకుంటున్నారని.. తాను సింగిల్ మీనింగ్‌తోనే ఆ మాట పెట్టానని.. తనకు మద్దతుగా ఉండే కొన్ని కాక్ పదాలను ట్వీట్‌కు జోడించారు. మోడీని సమర్థిస్తూ సైనా పెట్టిన ట్వీట్‌ను విమర్శించారు కాబట్టి సహజంగానే బీజేపీ మద్దతుదారుల నుంచి సిద్ధార్థ్‌పై దాడి పెరిగింది. జాతీయ మహిళా కమిషన్ కేసు పెట్టాలని ముంబై పోలీసుల్ని ఆదేశించింది.

సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేయాలని ట్విట్టర్‌కు సిఫార్సు చేసింది. ఈ అంశంపై నెటిజన్లు రెండు రకాలుగా చీలిపోయారు. కొంత మంది సిద్ధార్థ్‌కు మద్దతుగా మరికొంతమంది సైనాకు సపోర్ట్‌గా స్పందిస్తున్నారు . ఇటీవలే ఏపీలో టిక్కెట్ల అంశంపై సిద్ధార్థ్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయన జాతీయ అంశాన్ని నెత్తికెత్తుకున్నారు. అయితే సిద్ధార్థ్‌కు ఇవేమీ కొత్త కాదు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close