దేశంలో చిచ్చు పెట్టారు.. రాష్ట్రంలో పెట్టబోతున్నారు !

శుక్రవారం దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలు భవిష్యత్‌ భయాన్ని కలిగించక మానవు. తమ ప్రవక్తపై అనుచితవ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఓ వర్గం తీవ్రంగా ఆందోళనలు చేసింది. అవి దారి తప్పాయి. హింసకు కారణం అయింది. ఈ పరిస్థితి ఎప్పటికి చల్లారుతుందో తెలియదు కానీ.. రావణకాష్టం చేయడానికి మాత్రం రాజకీయం కాచుకుని కూర్చుకుంది. ఏపీలోనూ అలాంటి చిచ్చే పెట్టడానికి రంగం సిద్ధమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోనసీమ జిల్లా పేరును మార్చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నీతికవాతు నిర్వహిస్తామని కొన్ని సంస్థలు ప్రకటించాయి. దీనికి ప్రభుత్వ మద్దతు ఉందన్న ప్రచారం జరుగుతోంది. సీఐడీ డీజీ హోదాలో ఉన్న సునీల్ కుమార్ నడుపుతున్న క్రైస్తవ మిషనరీ దీని వెనుక ఉందని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. నీలి కవాతు పేరుతో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలకు ప్రణాళికసిద్ధం చేశారని ఆయన నేరుగా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న కొన్ని ఘటనలు.. వాటికి సంబంధించి పర్యవసానాలను ఆయన వివరించారు.

ఈ క్రమంలో నీతి కవాతుపై ఏపీలో చర్చ ప్రారంభమయింది. కోనసీమ అల్లర్లు పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు చేసిన కుట్రని తేలిపోయింది. మంత్రి, ఎమ్మెల్యేకు కనీస ఓదార్పు దక్కలేదు. ఇప్పుడు దాన్ని సాకుగా చూపించి చిచ్చు పెట్టాలని వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని… అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నీలి కవాతు అంశం .. హైలెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కోనసీమ ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. కానీ మళ్లీ చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతూండటమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close