ఎక్కువగా ఆనందించేది సోనియాయే!

హైదరాబాద్: మొత్తం మీద బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎక్కువగా ఆనందించేది సోనియాగాంధి అని చెప్పుకోవాలి. తన కొడుకును ‘రాగా’ ఐరన్ లెగ్ అని, ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ కాంగ్రెస్ పరాజయం అని అందరూ జోక్‌లు వేసుకుంటున్న ప్రస్తుత సమయంలో మొదటిసారి రాహుల్ పర్యటించిన చోట కాంగ్రెస్ కూడా విజయం సాధించటం సోనియాకు ఆనందకరమైన విషయమేగా! సొంతంగా కాకపోయినా, మోడికి చావుదెబ్బ తగిలింది కాబట్టి కాంగ్రెస్‌కు విజయమే. బీహార్‌లో పోటీచేసిన 41 స్థానాలలో దాదాపు 25 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2005 తర్వాత బీహార్‌లో కాంగ్రెస్ రెండంకెల స్థానాలు దక్కించుకోవటం ఇదే. అందుకే కాంగ్రెస్ నేతలు ఇవాళ రెచ్చిపోతున్నారు. బీహార్‌లో విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. నితీష్‌నూ, లాలూను ఒక్కచోటకు చేర్చి మహాకూటమి ఏర్పాటు చేయటం రాహుల్ వల్లే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీహార్ విజయం కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పొచ్చు. ఇది ఎంతోకాలం తర్వాత లభించిన విజయం. 2013లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధించటం ఇదే! 2014 పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పేలమైన ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.

బీహార్ విజయంలో రాహుల్ ముఖం ఇవాళ వెలిగిపోయింది. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోడికి చురకలు అంటించారు. మోడి తన దురహంకారం ఇకనైనా తగ్గించుకోవాలని అన్నారు. అది ఆయన పదవికిగానీ, దేశానికిగానీ శోభనివ్వదని వ్యాఖ్యానించారు. ఇక విదేశీ యాత్రలు కట్టిపెట్టి, దేశంలోని రైతులను పట్టించుకోవాలని, నిరుద్యోగులను కలుసుకోవాలని, వారిని దగ్గరకు తీసుకని మాట్లాడాలని అన్నారు. మాటలు కట్టిపెట్టి పని ప్రారంభించాలని సూచించారు. ఈ విజయం ఎన్డీఏపైన కాదని, బీజేపీ, ఆరెస్సెస్, మోడి సిద్ధాంతాలపైన విజయమని అన్నారు. హిందువులు, ముస్లిమ్‌లకు మధ్య గొడవపెట్టి ఎన్నిలలో గెలవాలనుకోవాటం సాగదని ఇచ్చిన సందేశమని చెప్పారు. మోడి తన పద్ధతి మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌కు ఈ విజయంద్వారా గౌరవం పెరగనుంది. పార్టీ అధ్యక్షుడిగా చేసినా ఆశ్చర్యపోనవసరంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close