జీవితా రాజశేఖర్, పవన్ అభిమానులపై శ్రీరెడ్డి కేసులు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ రగడ ఇంకా చల్లారలేదు. అమ్మాయిల ఆత్మ గౌరవం, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు దగ్గర మొదలైన శ్రీరెడ్డి పోరాటం ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరిందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. వర్మ సలహా మేరకు క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో పవన్ కల్యాణ్ మీద నోరు పారేసుకున్న శ్రీరెడ్డి తర్వాత అభిమానుల ఆగ్రహం చవి చూడాల్సి వచ్చింది. ఆమె క్షమాపణలు కోరినా.. అప్పటికే ఆలస్యమైంది. చాలామంది పవన్ అభిమానులు ఆమెపై నోరు పారేసుకున్నారు. హద్దులు దాటి మాట్లాడారు. అటువంటి అభిమానులపై సైబర్ క్రైమ్ విభాగంలో శ్రీరెడ్డి కేసులు పెట్టారు. అభిమానుల మాటలు ఆమె మనసును బాధించి ఉండవచ్చు. అందుకే, ఆమె కేసులు పెట్టి ఉండవచ్చు. అలాగే, యూట్యూబ్ సెన్సేషన్స్ డార్లింగ్ దాస్, లబో తదితరులపై కేసులు పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే… జీవితా రాజశేఖర్ మీద కూడా ఆమె కేసు పెట్టడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే… జీవిత ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది సామాజిక కార్యకర్త సంధ్యపై. శ్రీరెడ్డిని పెద్దగా ఏమీ అనలేదు. “ఒకసారి.. రెండుసార్లు మోసపోతే ఓకే. పదేళ్లుగా మోసపోతే ఎవరిది తప్పు?” జీవిత ప్రశ్నించారు. అందుకు కేస్ పెట్టారో? జీవిత కూడా ఏమైనా హద్దులు దాటి మాట్లాడారో? ఇలా మొత్తం మీద 41మందిపై శ్రీరెడ్డి కేసులు పెట్టారు. “ఒక్కొక్కడి తాట వలుస్తా జాగ్రత్త, ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని నోటి కొచ్చినట్లు తిట్టారుగా, సైబర్ క్రైమ్ లో 41 Members మీద కేసులు పడ్డాయి” అని సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పేర్కొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లెట్స్ ఓట్ : బానిసలుగా ఉంటారా ? పాలకులుగానా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట...

ప్రత్యేక బస్సులు పెట్టని ఆర్టీసీ – ఆపగలరా ?

హైదరాబాద్ నుంచి ఏపీకి లక్షల మంది జనం తరలి వచ్చారు. వారు ఎవరికి ఓటేస్తారన్న సంగతి తర్వాత తాము ఎక్కడ ఉన్నా తమ రాష్ట్ర భవిష్యత్ లో తమ వాటా ఉండాలన్నా ఉద్దేశంతో...

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close