సుజనా గ్రూప్‌తో సంబంధం లేదన్న సుజనా చౌదరి

హైదరాబాద్: మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. తనకు ఎలాంటి సమన్లూ అందలేదని ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు. రుణం తీసుకున్నపుడు తాను సంతకం కూడా చేయలేదని అన్నారు. ఆ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న సుజనా గ్రూప్ సంస్థలో తాను డైరెక్టర్‌ను కూడా కానని చెప్పారు. సమన్లు జారీ చేయటం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడికైనా సమన్లు ఇవ్వొచ్చని అన్నారు. రు.100 కోట్లకు రుణం తీసుకుని మోసం చేశారంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ పెట్టిన కేసులో హైదరాబాద్ 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ తనకు జారీ చేసిన సమన్లపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు. ఈ విషయంపై ప్రశ్న అడిగిన విలేకరిపై విసుక్కుంటూ ప్రెస్ మీట్ నుంచి లేచి వెళ్ళిపోయారు.

మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందిస్తూ, విభజన హామీలు అమలు కాకపోతే రాజ్యాంగాన్ని గౌరవించనట్లేనని చెప్పారు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పామని పేర్కొన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ను ఈ రైల్వే బడ్జెట్‌లోనే ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమరావతి ప్రాంతంలో భూకంప ప్రభావాలపై కమిటీ వేశామని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయాలో ఆ కమిటీ అధ్యయనం చేసి సూచనలు ఇస్తుందని మంత్రి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లర్లపై సిట్ దూకుడు… వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..

ఏపీలో అల్లర్లపై సిట్ దూకుడు వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. అల్లర్ల విషయంలో వైసీపీ నేతలు చెప్పినట్లు కిందిస్థాయి పోలీసులు వ్యవహరించడంతోనే పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సిట్ ప్రాథమిక నివేదికలో పేర్కొనడంతో...

తెలంగాణలో 950కోట్ల స్కామ్…మంత్రిపై సంచలన ఆరోపణలు..!!

తెలంగాణలో ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి తాజాగా మరో బిగ్ బాంబ్ పేల్చారు. ఆర్ ట్యాక్స్ కు జతగా మరో ట్యాక్స్...

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close