సాగర్ బైఎలక్షనే ప్రైవేట్ టీచర్లను కాపాడుతోంది..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రైవేటు టీచర్ల కష్టాలు కనిపించాయి. వెంటనే వారిని ఆదుకోవడానికి ఏర్పాట్లు చేసేశారు. అయితే ఇలా ఆదుకునే ఆలోచన చేయడానికి నాగార్జున సాగర్ ఉపఎన్నికే కారణంగా చెప్పుకోవచ్చు. ఉపఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఓ ప్రైవేటు టీచర్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజులకే.. ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో… ప్రైవేటు టీచర్లు పెద్ద ఎత్తున సెల్ఫీ వీడియోల ద్వారా తమను ప్రభుత్వం ఆదుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా సిరిసిల్లకు చెందిన ఓ ఉపాధ్యాయుడు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఇప్పటికే ప్రైవేటు టీచర్లందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

స్కూళ్లు తెరవకుండా నిలిపివేయడంతో వారికి ఉపాధి కరువయింది. ఏడాది నుంచి ఇదే పరిస్థితి ఉంది. వారందర్నీ ఆదుకోవాలన్న డిమాండ్లు చాలా కాలం నుంచి ఉన్నాయి. కానీ ఎప్పుడూ కేసీఆర్.. స్పందించలేదు. ఇప్పుడు ఆత్మహత్యలు ప్రారంభం కావడంతో స్పందించక తప్పలేదు. ప్రైవేటు టీచర్ భార్య నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన గంటలోనే… ప్రైవేటు టీచర్లకు రూ. రెండువేల సాయం… నెలకు పాతిక కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. ఒక్క సారే ఇస్తారని అనుకున్నారు.

కానీ మళ్లీ స్కూళ్లు తెరిచే వరకూ.. ప్రైవేటు టీచర్లందరికీ… రూ. రెండువేల సాయం … రూ. పాతిక కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ప్రైవేటు టీచర్లు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తోంది. ఉపఎన్నికల పుణ్యమా అని ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను పట్టించుకుంటోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది ..స్కూళ్లు తెరవాలనే డిమాండ్‌నే వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దానికి సుముఖంగా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close