“డీపీ” దేశభక్తి తెలుగురాష్ట్రాల పార్టీలకు నచ్చలేదు !

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన “డీపీ” ద్వారా దేశ భక్తి ప్రదర్శన చాలా మందికి నచ్చడం లేదు. మేం భారతీయులు.. మా దేశభక్తిని ప్రదర్శించుకోవాల్సిన..నిరూపించుకోవాల్సిన అవసరం ఏమిటన్న ఆలోచన ఎక్కువమందిలో ఉంది. అయితే బీజేపీ వర్గాలు.. బీజేపీ మిత్రపక్షాలు.. ఇంకా సానుభూతి పరులు డీపీలు మార్చుకుంటున్నారు. అయితే ఏపీలోని చాలా రాజకీయ పార్టీలు డీపీలను మార్చుకోలేదు. సీఎం జగన్ డీపీ మాత్రం మూడో తేదీన మారింది. రెండో తేదీ నుంచిమార్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.

అయితే ఒక రోజు ఆలస్యంగా ఏపీ సీఎం అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో డీపీ మారింది. అయితే రాజకీయ పార్టీ పరంగా ఎలాంటి డీపీలు మార్చుకోలేదు. వైసీపీ మాత్రమే కాదు. .టీడీపీ జనసేన కూడా ఎలాంటి డీపీలు మార్చే కార్యక్రమాన్ని పెట్టుకోలేదు. ప్రధాని పిలుపునిచ్చిన మేరకు అందరూ డీపీలు మార్చుకుంటే సోషల్ మీడియాలో భారత త్రివర్ణ పతాకం మాత్రమే కనిపించేది. కానీ ఎక్కువ మంది అధి అధికారిక కార్యక్రమం అనుకున్నారు.

అధికారంలో ఉన్న వారికే పరిమితమనుకున్నారు. సామాన్యులైతే పట్టించుకోలేదు. మధ్య తరగతి జీవులైతే.. ఇలాంటి ఈవెంట్లను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. వారి జీవితం.. రోజువారీ ఖర్చుల్లో నలిగిపోతోంది. అదేసమయంలో మోదీ పిలుపునిచ్చిన ఈ కారక్రమంపై విమర్శలు కూడా వస్తున్నాయి. చేయాల్సినవి చేయరు కానీ ఇలాంటిప్రోగ్రామ్స్ మాత్రం పెడతారని ధరల పెరుగుదలపై కడుపు మండిపోయినవారు చెబుతున్నారు. ఏపీలోనే కాదు..తెలంగాణలోనూ అదే పరిస్థితి. అయితే చాలా మంది బీజేపీ నేతలు కూడా డీపీలు మార్చుకోవడం మర్చిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్ల‌మ్మ‌కు కేసీఆర్ యాది కొస్తున్నారా… రాముల‌మ్మ ట్వీట్ అంత‌రార్థం ఏంటో?

కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కు మద్దతుగా విజయశాంతి బీజేపీకి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన...

ఏపీలో ర‌క్త చ‌రిత్ర‌… ఇప్పుడే ఇలా ఉంటే ఫ‌లితాల రోజున ఎలా ఉంటుందో?

ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ ఏపీలో...

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close