ఏపీ బీజేపీలో ప్రో జగన్ టీమ్‌ను పక్కన పెట్టేసిన హైకమాండ్ !

ఏపీ బీజేపీలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. తాజాగా హైకమాండ్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ ప్రభుత్వంపై పోరాడమని చాలా కాలంగా హైకమాండ్ ఆదేశిస్తోంది. అయితే ఇక్కడ నేతలు మాత్రం లాబీయింగ్‌కే పరిమితమవుతున్నారు. అందుకే ఇప్పుడు టీమ్‌ను మార్చేసింది. వైసీపీ ప్రభుత్వంపై చార్జిషీట్లు వేసే ప్రోగ్రాంకు పూర్తి స్థాయిలో ప్రో వైసీపీ టీమ్‌ను పక్కన పెట్టేసింది. ఐదు నెలల క్రితం… వైజాగ్‌లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని పార్టీ నేతలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడంతో… కమిటీ ఏర్పాటు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

అంశాల వారీ చార్జిషీట్‌లు రూపొందించేందుకు జాతీయ నాయకత్వం నలుగురు నేతలతో కమిటీ నియమించింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లతో కమిటి ఏర్పాటు చేసింది. మద్యం, ఇసుక, మట్టి, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మాస్, ఆర్డీఎస్ఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, సెంటు భూమి పథకంలో అక్రమాలు జరిగాయి. వైజాగ్‌లో భూ ఆక్రమణలు, రిషికొండలో చోటు చేసుకున్న అక్రమాలు… వంటి విషయాలపై బీజేపీ కమిటీ చార్జిషీట్‌లు రూపొందించనుంది.

ఏపీలో జరుగుతున్న అవినీతిపై చార్జిషీట్‌ లు దాఖలు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా అంశాలను ఖరారు చేసి… ప్రతి పోలీస్ స్టేషన్‌లో చార్జిషీట్‌లతో పిర్యాదు చేయాలని రాష్ట్ర నేతలకు ఆదేశించింది. నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సోము వీర్రాజు అండ్ కోను పక్కన పెట్టి నలుగురు యాంటీ వైసీపీ టీములోని నేతలకు బాధ్యతలు అప్పగించారు. చార్జిషట్ల కమిటీ మే 5వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది. కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలు చోట్ల స్వయంగా చార్జిషీట్‌లు దాఖలు చేయనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close