కాల్ డ్రాప్స్ కి సర్వీస్ ప్రొవైడర్లు ఇక జరిమానా చెల్లించక తప్పదు

ఇప్పుడు మన దేశంలో కోట్లాది మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. పట్టణాలు, పెద్దపెద్ద నగరాలలో అయితే ఒక్కొక్కరు రెండేసి మూడేసి ఫోన్లు అందులో మళ్ళీ రెండ్రెండు సిమ్ కార్డులు వేసుకొని మరీ వాడుకొంటున్నారు. అందుకే సెల్ ఫోన్ కంపెనీలకి సెల్ ఫోన్ తయారీ సంస్థలకి, సెల్ ఫోన్ తో ముడిపడున్న ప్రతీ దానికి మన దేశంలో మంచి బిజినెస్ ఉంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువత తిండి లేకపోయినా భరిస్తారు కానీ చేతిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్లు విలవిల కొట్టుకొంటారు. అటువంటి వారి కోసమే 2జి వచ్చింది. అది పోయి 3జి వచ్చింది. అదీపోయి ఇప్పుడు 4జి కూడా వచ్చేసింది. అయితే వినియోగదారులు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న సేవలతో సంతృప్తిగా ఉన్నారా? అంటే లేరనే చెప్పుకోక తప్పదు. కారణం కాల్ డ్రాప్స్!

ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయిపోవడం ఇప్పుడు చాలా సర్వసాధారణ విషయం అయిపోయింది. నానాటికీ కస్టమర్లు, మొబైల్ కనెక్షన్లు పెరుతున్నాయే తప్ప సరయిన నెట్ వర్క్ సిగ్నల్ అందించేందుకు తగినన్ని సెల్ టవర్లను సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పాటు చేసుకోకపోవడమే వలననే సెల్ టవర్లపై ఒత్తిడి పెరిగి మధ్యలో కాల్స్ కట్ అయిపోతుంటాయి. ఈ సమస్యని కేంద్రప్రభుత్వం చాలా కాలం క్రితమే గుర్తించి సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించింది, కానీ వారు ఆ హెచ్చరికను పెడ చెవినపెట్టడంతో టెలీఫోన్ రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా 2016, జనవరి 1 నుంచి ఒక్కో కాల్ డ్రాప్ కి రూపాయి చొప్పున రోజుకి గరిష్టంగా మూడు రూపాయల వరకు వినియోగదారులకు చెల్లించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.

కాల్ డ్రాప్ అయిన 4 గంటలలోగా సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు వినియోగదారుడికి దానికి తాము జరిమానా చెల్లిస్తున్నట్లు ఎస్.ఎం.ఎస్. మెసేజ్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రీ పెయిడ్ కస్టమర్లకు జరిమానాకు సరిపోయేంత సమయం కలపడం ద్వారా, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు తరువాత బిల్లులో ఆ మొత్తాన్ని అడ్జస్ట్ చేయడం ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వారు జరిమానా చెల్లిస్తున్నారో లేదా అని ట్రాయ్ నిత్యం గమనిస్తుంటుంది. చెల్లించకుండా ఎగవేస్తున్న వారిపై మళ్ళీ అదనంగా జరిమానా విధిస్తుంది. ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలశ్యం అయినప్పటికీ వినియోగదారుడికి మేలు చేకూర్చే నిర్ణయమే తీసుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close