మునుగోడులో టీడీపీ తరపున టీఆర్ఎస్ సీనియర్ నేత పోటీ ?

మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ తరపున బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తారంటూ.. సోషల్ మీడియాలో ప్రారంభమైన ప్రచారం టీఆర్ఎస్‌లో కలకలం రేపింది. భువనగిరి మాజీ ఎంపీ అయిన బూర నర్సయ్య గౌడ్‌కు చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. అయితే ఆయన టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. మునుగోడు టిక్కెట్ ఆశించారు. బీసీలకే టిక్కెట్ ఇవ్వాలని ఆయన నినదించారు. కానీ కేసీఆర్ రెడ్లకే కేటాయించారు. అయితే బూరనర్సయ్య గౌడ్‌ను బుజ్జగించారు.

కానీ రెండు రోజులుగా టీడీపీ మునుగోడులో ప్రచారం చేస్తుందని.. ఓ కీలకమైన బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇంతకూ ఆయనెవరంటే బూరనర్సయ్య గౌడ్ అనే చెప్పుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనేదే లేకుండా కేసీఆర్.. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు చంద్రబాబు కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మునుగోడు ఉపఎన్నికతోనే టీడీపీ ఫామ్‌లోకి వచ్చేలా చేయాలనుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

అయితే బూర నర్సయ్య గౌడ్ మాత్రం టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తాననే ప్ర‌చారంలో నిజం లేదు.. అలాంటి వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారాన్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని స్పందించారు. అయితే రాజకీయాలు అంటే… నిప్పు లేకుండా పొగ రాదు. అందుకే బూరనర్సయ్య గౌడ్ ప్రకటన తర్వాత కూడా ముచ్చట్లు చల్లారలేదు. పదమూడో తేదీన మునుగోడులో పోటీ చేయాలా వద్దా అన్నది చంద్రబాబు డిసైడ్ చేస్తారు. ఆ రోజున అభ్యర్థినికూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నర్సయ్య గౌడ్ సస్పెన్స్ కూడా ఆ రోజే తేలనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close