మెహ‌రీన్‌.. అన‌సూయ‌.. రేపు ర‌కుల్‌..??

చికాగోలో క‌థానాయిక‌ల చీక‌టి భాగోతాలు బ‌య‌ట‌ప‌డ్డాక‌.. తెలుగు క‌థానాయిక‌ల‌పై అనుమాన‌పు నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. యూ ఎస్ అథారిటీస్ టాలీవుడ్ కి చెందిన ప‌లువురు క‌థానాయిక‌ల్ని ప్ర‌శ్నించ‌డం మొద‌లెట్టారు. మెహ‌రీన్ కి ఇలాంటి అనుభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు యాంక‌ర్ క‌మ్ ఐటెమ్ స్పెష‌లిస్ట్‌ అన‌సూయ‌ని కూడా యూ ఎస్ అథారిటీస్ ప్ర‌శ్నించిన‌ట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివ‌రాలు అందాల్సివుంది. కేవలం వాళ్ల ద‌ర్యాప్తులో భాగంగా కొంత‌మంది టాలీవుడ్ క‌థానాయిక‌ల్ని యూ ఎస్ అథారిటీస్ టార్గెట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ జాబితాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ర‌కుల్‌నే కాదు, త‌ర‌చూ షూటింగులు, అవార్డు వేడుక‌ల నిమిత్తం విదేశాల‌కు వెళ్లే క‌థానాయిక‌లంద‌రి లిస్టుని సేక‌రించి, వాళ్ల‌ని అధికారులు ప్ర‌శ్నించ‌బోతున్నార‌ట‌. అందుకే క‌థానాయిక‌లు ప్ర‌స్తుతం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. విదేశీ టూర్లంటే వాళ్ల‌లో ఇది వ‌ర‌కెప్పుడూ లేని భ‌యం క‌నిపిస్తోంది. ఎవ‌రో కొంత‌మంది చేసిన త‌ప్పుల‌కు తామంతా త‌ల‌దించుకోవాల్సివ‌స్తోంద‌ని సీనియ‌ర్ క‌థానాయిక‌లు వాపోతున్నారు. ఎవ‌రైనా స‌రే.. దొర‌క‌నంత వ‌ర‌కే. ఒక్క‌సారి ఈ తెర‌లు తీసేశాక‌… దొంగ ఎవ‌రో, దొర ఎవ‌రో తేలుతుంది. గుమ్మ‌డికాయ దొంగ అంటే భుజాలు త‌డుముకున్న‌ట్టు కొంత‌మంది యూ ఎస్ అథారిటీస్ పేరు చెబితేనే ఉలిక్కి ప‌డుతున్నారు. డ్ర‌గ్స్ కేసు, కాస్టింగ్ కౌచ్ వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టాలీవుడ్‌కి… ఇది మ‌రో అల‌జ‌డి కిందే లెక్క‌. దీన్నుంచి తేరుకోవ‌డానికి ఎంత కాలం ప‌డుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close