వంశీకి పోటీగా ఆయన కూడా వచ్చేశారు !

వల్లభనేని వంశీ వైసీపీ హైకమాండ్ చెప్పినట్టల్లా చేస్తున్నారు. బూతులు తిట్టమంటే తిడుతున్నారు. జూమ్ కాల్స్‌లోకి చొరబడమంటే చొరబడుతున్నారు. అయితే ఆయనకు నియోజకవర్గంలో ఇతర నేతలు వ్యతిరేకంగా ఉండకుండా చేయడంలో మాత్రం వైసీపీ పెద్దలు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి వంశీని ఓడించినంత పని చేసిన యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ వచ్చారు. కొంత కాలంగా ఆయన అమెరికాలో ఉంటున్నారు. గన్నవరం రాజకీయాలు పట్టించుకోలేదు. దీంతో దుట్టా వర్గమే వల్లభనేనితో పోరాడుతూ వస్తోంది.

తాజాగా యార్లగడ్డ వెంకట్రావు కూడా రంగంలోకిదిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విలన్ తో పోటి చేశానని. అతన్ని పార్టీలోకి తీసుకునే సమయంలోనే వ్యతిరేకించాను.. ప్రతిసారి నేను అధిష్టానం తో పోరాటం చేయలేనని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పని మీదా ఒక 6 నెలల అమెరికా వెళ్లానని ఆ సమయంలో తాను టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్లుగా ప్రచారం చేశారని..కానీ తాను వైసీపీలోనే ఉన్నానన్నారు. రాజకీయం చేయాల్సిన సమయంలో రాజకీయం చేస్తానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను పార్టీలోకి తీసుకవచ్చారని అయన వెంట నడుస్తానని చెబుతున్నారు.

నాకు ఏదైనా బాధ్యత ఇస్తే పని చేసి చూపిస్తాం ఇవ్వకుండా ఏలా పనిచేసేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నప్పుడు ఒక తట్టమట్టి తవ్వలేదు కనీసం ఒక్క పైసా అవినీతి కి పాల్పడలేదు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటి చేస్తాను . ఏ పార్టీ నుంచి బరిలో దిగుతానన్న దానిపై అనేక మంది ఊహాగానాలు చేస్తున్నారని.. దాని వల్ల తన స్థాయి పెరిగిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి యార్లగడ్డ మరోసారి తన రాజకీయ అవకాశాలు వెదుక్కుంటూ రావడంతో వంశీకి మరో మైనస్ వచ్చి పడినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close