మన రెండు ప్రభుత్వాలు ఏం సాధించినట్లు?

ఈసారి రైల్వే బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు రెండూ చాలా ఆశలు పెట్టుకున్నాయి. అయితే మొత్తం పది కోట్ల మంది ప్రజలను దారుణంగా వంచిస్తూ రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు తన రైల్వే బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించేశారు. ఏదో నాంకేవాస్తే ఎక్కడినుంచో ఎక్కడికో వెళ్లే రైల్వే వ్యవహారాల్లో పొరబాటుగా తెలుగు ప్రాంతాల పేర్లు కూడా ప్రస్తావనకు రావడం తప్ప.. రైల్వేబడ్జెట్‌ తెలుగు ప్రాంతానికి ఇచ్చిందంటూ ఏమీ లేదు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఇద్దరూ సమానంగా మోసపోయారు. కేంద్రంలో భాగస్వామి పార్టీగా ఉంటూ వారి మిత్రపక్షం అయినందుకు అటు ఏపీ లోని తెలుగుదేశం సాధించిందీ వీసమెత్తు లేదు. ఇటు కొత్తగా కేంద్రంలోని భాజపాతో మెతకవైఖరి ప్రారంభించి.. అంశాలవారీ మద్దతు ఇస్తాం అంటూ వారితో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు సాధించిందీ ఏమీ లేదు. ఆదాయమూ ఖర్చులూ బ్యాలెన్స్‌ షీట్‌గానూ, అభివృద్ధి ముసుగులో ప్రైవేటు రంగానికి దోచిపెట్టే దిశగా వేసే అడుగుల నివేదికతోనూ, అంతోఇంతో ప్రయాణికుల వసతుల గురించి ప్రస్తావిస్తూ సురేశ్‌ ప్రభు బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

1.87 లక్షల కోట్ల ఆదాయం మీద కన్నేసిన సురేష్‌ప్రభు ప్రణాళిక అంచనా వ్యయం 1.21 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. పీపీపీ కొత్త ప్రాజెక్టులు అనేకం రాబోతున్నట్లు వెల్లడించారు. కొత్త ఆదాయ వనరుల మీద దృష్టిపెడుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు వసతుల కల్పన పరంగా కొన్ని కొత్త ఆలోచనలు ఈ బడ్జెట్‌లో ఉండడాన్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగాన్ని సగటున గంటకు 50 నుంచి 80 కిలోమీటర్లకు పెంచాలనే నిర్ణయాల్ని కూడా అభినందించాల్సిందే. అయితే కొత్తగా ఏర్పడిన రెండు తెలుగురాష్ట్రాలను మాత్రం దారుణంగా నిరాశపరచడం విమర్శలకు గురవుతోంది.
అయితే కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి గానీ, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను గురించి గానీ.. ఎలాంటి కొత్త ప్రాజెక్టుల గురించి కూడా సురేశ్‌ప్రభు కనీసం ప్రస్తావించలేదు.

ఏపీ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి విశాఖ రైల్వే జోన్‌ గురించిన మాట మాత్రపు ప్రస్తావన కూడా లేకపోవడం చాలా దారుణం అని జనం భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close