జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు సాగదు ?

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై విచారణ పదేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దర్యాప్తు సంస్థ చార్జిషీట్లను ఆధారాలను సమర్పించింది. కానీ ఇప్పటి వరకూ నిందితులతా వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత ఒకరు క్వాష్ పిటిషన్‌లు.. ఇతర పిటిషన్లు దాఖలు చేస్తూ.. బెయిల్ పై బయటకు వచ్చి వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి బయటకు వచ్చి మళ్లీ సీఎం అయి కోర్టుకు కూడా వెళ్లడం మానుకున్నారు. ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసు విచారణ సాగుతుందో లేదో ఎవరికీ తెలియదు.

పదేళ్ల కిందట ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన కాలంలో జగన్ రెడ్డిని ఎంత ఆప్యాయంగా చూస్తున్నారో కానీ… అసలు కేసులు ముందడుగే పడలేదు. పైగా ఈడీ కేసులు, సీబీఐ కేసులు వేర్వేరుగా అయితే.. ముందు ఈడీ కేసుల విచారణ జరగకూడదని ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు. సీబీఐ కేసులు అవినీతి కేసులు..ఈడీ కేసులు మనీలాండరింగ్ కేసులు.. వేర్వేరు నేరాలయితే.. భిన్నమైన ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో ఉంది.

ఇలా వరుసగా పిటిషన్ల పేరుతో టైం పాస్ చేస్తూనే ఉన్నారు కానీ విచారణకు రావడం లేదు. అత్యంత ఘోరమైన క్రిమినల్ మనస్థత్వంతో ఆర్థికఉగ్రవాదంలాగా కోర్టులు అభిప్రాయపడిన నేరాలు చేసిన జగన్ రెడ్డి .. బెయిల్ వల్ల బయటకు వచ్చి సీఎం అయి.. అన్ని వ్యవస్థలను దిగజార్చేస్తున్నారు. చివరికి ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద అత్యంత దారుణమైన ఆరోపణలు చేసి.. నేరుగా సుప్రీంకోర్టుకే లేఖ రాసి..దాన్ని మీడియాకు విడుదల చేశారు. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతలందర్నీ జైల్లో పెట్టి ఎన్నికలక వెళ్తానని సవాల్ చేస్తున్నారు.

వీఐపీల కేసులకు ఓ చట్టం.. సామాన్యులకు మరో చట్టం అన్నట్లుగా వ్యవస్థలు పని చేస్తూండటంతో.. సామాన్యుడికి వ్యవస్థలపై నమ్మకం పోతోంది. తప్పు చేసిన వాళ్లకు శిక్షపడకపోగా వారే.. తర్వాత తప్పు చేయని వాళ్లని వేధించే అవకాశాలు వస్తూండటంతో ఇక ఎవరికైనా.. నమ్మకం ఎలా ఉంటుంది. దేశంలో సామాన్యులతో పాటుపెద్దలకు కూడా చట్టాలు సమానంగా వర్తిస్తాయని.. అధికారంలో ఉన్న వారు.. పేదల్ని.. ప్రతిపక్ష నేతల్ని వేధించడానికి కాదని.. నిరూపణ అయిన రోజునప్రజలకు వ్యవస్థల్లో మరింత నమ్మకం కుదురుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ్ దీప్ ఇంటర్యూలు : పవన్ జోష్, చంద్రబాబు విజన్ – జగన్ అహంకారం !

అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని... ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను...

సేమ్ బీఆర్ఎస్ లాగే వైసీపీకి ఓవైసీ సపోర్ట్ !

మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ...

బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోన్న ధృవ్ రాతీ..!

ధృవ్ రాతీ... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ...

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close