గడపగడపకూ వైసీపీ – వాళ్ల టెన్షన్ వేరే !

వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మూడేళ్ల పాలనలో ఒక్కో ఇంటికి ఎంత ఇచ్చామో చెబుతూ పత్రాలు కూడా తీసుకుని బయలుదేరుతున్నారు. లబ్దిదారుల జాబితా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర నుంచి వైసీపీ నేతలు తీసుకున్నారు. తాము వెళ్లే ప్రతీ కాలనీలో వారిని కలవడంతో పాటు.. కొత్తగా ఎవరికైనా పథకాలు కావాలమో రాసుకుంటారు. ఇంత కాలం ఎందుకు ఇవ్వలేదని వచ్చేప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పి… సానుకూలత తెచ్చుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

ఇంకా ఎన్నికలకు రెండేళ్లు ఉంది. అయితే జగన్ మాత్రం ఇప్పట్నుంచే జనాల్లోకి పోవాలని నేతలను ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ నేతలు ఈ మూడేళ్ల కాలంలో తాము ఏం చేశామో చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎమ్మెల్యేల స్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కింది స్థాయిలో ఉపాధి హామీ పనులతో ఆర్బీకేలు.. ఇతర పనులను చేపడితే వాటికి బిల్లులు రాలేదు. దీంతో గ్రామాల్లో క్యాడర్ మరో పైసా అయినా పార్టీ కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు.

మరో వైపు పన్నులు..పెరిగిపోయిన నిత్యవసర వస్తువుల ధరలు.. అధికార పార్టీగా వైసీపీ నేతలకు దడ పుట్టిస్తున్నాయి. ఏ చిన్నఘటన జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో వ్యతిరేకత బాగా పెరిగిందనడానికి సోషల్ మీడియాలో కనిపిస్తున్న వ్యతిరేకతే కారణం అని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ నేతలు ఎంత మేర జోరుగా ప్రజల్లోకి వెళ్తారో.. వారి వద్ద నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close