పట్టుదల నుంచి ప్రయత్నం వరకూ..! హోదాపై జగన్‌ది ముందడుగే..!?

ఇరవై మందికిపైగా ఎంపీలను ఇస్తే… కేంద్రంతో పోరాడి అయినా ప్రత్యేకహోదా తీసుకు వస్తానని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు. వైసీపీ ఎంపీలకు… టీఆర్ఎస్ ఎంపీలు తోడైతే.. ఇక తిరుగు ఉండదని చెప్పారు. అలాగే.. తొలి సారి .. ఎంపీలతో సమావేశమైనప్పుడు… ప్రత్యేకహోదా కోసం అవసరం అయితే రాజీనామాలకు సైతం సిద్ధంగా ఉండాలని సూచించారు. దాంతో..జగన్‌ది పోరుబాటేనని… అందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీ పర్యటనలో మాత్రం… కాస్త తేడాగా మాట్లాడారు.

ప్రధానిని అదే పనిగా కలిస్తే హోదా ఇస్తారా..?

ప్రధానితో సమావేశం తర్వాత ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకహోదా కోసం… ప్రధానిని కావాలంటే… 30, 40 సార్లు కలుస్తానని ప్రకటించారు. ఎప్పుడో ఓ సారి ప్రత్యేకహోదా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి స్పందన… కేంద్రంపై.. పోరాడలేము.. అడిగి.. అడిగి.. వాళ్లిచ్చినప్పుడే తీసుకోవాలి.. లేదంటే లేదన్నట్లుగా… ఉంది. దీంతో… ఎంపీలతో రాజీనామాలకు సిద్దంగా ఉండాలన్న మాటల తీవ్రత.. ఒక్క రోజులోనే తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీలో హోదాపై ఇచ్చిన స్పందన చూస్తే.. కేంద్రంపై పోరాటానికి ఏ మాత్రం సిద్ధంగా లేరన్న అభిప్రాయం మీడియా వర్గాల్లో ఏర్పడింది. మోడీని మచ్చిక చేసుకుని… హోదా తెచ్చుకోవాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసిన హోదా..!

ప్రత్యేకహోదా అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఓటింగ్‌లో అదే ప్రయారిటీగా మారింది. నాలుగేళ్ల పాటు బీజేపీతో ప్రభుత్వంలో భాగంగా ఉండి ప్రత్యేకహోదా తీసుకు రాకుండా… నాలుగేళ్ల తర్వాత టీడీపీ.. పోరాటం పేరుతో ప్రజల్లోకి రావడంతో… వారికి అనుమానం వచ్చింది. అందుకే.. జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. ఈ విషయం… జగన్‌కూ క్లారిటీ ఉంది కాబట్టే.. ఎంపీల సమావేశంలో రాజీనామాల గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎంత కొట్లాడినా… జగన్‌ బీజేపీతో సన్నిహితంగా ఉన్నా… జగన్‌కే.. ప్రజలు ఓట్లేశారు. ఈ విషయంలో.. జగన్మోహన్ రెడ్డి.. హోదా పోరాటానికి.. సిద్ధం అయితే బాగుంటుందన్న అభిప్రాయం.. రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

ముగ్గురు టీడీపీ ఎంపీలు పోరాడితే.. వైసీపీ ఎంపీలు కామ్‌గా ఉండగలరా..?

తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వాళ్లు ముగ్గురూ.. ప్రత్యేకహోదా పోరాటంలో.. తమదైన స్టైల్లో.. పార్లమెంట్‌లో గళం వినిపించిన వారే. వాళ్లు… ఈ సారి వచ్చిన అవకాశాన్ని వదులుకునే అవకాశం లేదు. ఈ విషయంలో… వైసీపీ ఎంపీలకు.. కాస్త ఇబ్బందికర పరిస్థితే వస్తుంది. ముగ్గురు ఎంపీలే… ప్రభుత్వంపై పోరాడితే… 22 మంది ఎంపీలు ఉన్న వాళ్లు.. సైలెంట్‌గా ఉంటే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ప్రత్యేకహోదా పోరాటం విషయంలో… జగన్.. కాస్త ఎగ్రెసివ్‌గా లేకపోతే… ప్రజల్లో నెగెటివ్ సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close