ఫిబ్రవరి 2 నుంచి జగన్ మరో యాత్ర ..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఆయన బస్సుయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాలను ఆయన బస్సుయాత్రలో కవర్ చేస్తారు. పాదయాత్ర ముగించిన తర్వాత నేరుగా తిరుమల శ్రీనివాసుడ్ని దర్శించకుంటారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ చదువుకుంటున్న కుమార్తెతో పది రోజులు గడిపి తిరిగి వస్తారు. ఆ తర్వాత బస్సుయాత్ర ప్లాన్ చేసుకుున్నారు. ఈ లోపే.. కృష్ణానది పక్కన తాడేపల్లిలో నిర్మించుకుంటున్న ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అందులో లాంఛనంగా గృహప్రవేశం చేస్తారు కానీ అందులో ఉండరు. ఎన్నికల తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో ఆ ఇంట్లో మకాం పెట్టే అవకాశం ఉంది.

ఇంత కాలం పాదయాత్ర చేసినా… అది ప్రజలకు గుర్తుండదని.. ఎన్నికలకు ముందు చేసిన పోరాటాలే.. ఎక్కువగా ఓటర్లను ప్రభావితం చేస్తాయని… జగన్ అనుకుంటున్నారు. నిజానికి బస్సుయాత్ర ప్రారంభమయ్యే సమయానికి… ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే సరికి… సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.అంటే.. ఓ రకంగా చెప్పాలంటే.. ఏపీలో ఫిబ్రవరి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఇలాంటి సమయమే కీలకమైనదని.. వైసీపీ భావిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేశారని… పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగానే.. ఇప్పటికే.. దాదాపుగా 120 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు… స్పష్టమైన సమాచారం ఇచ్చారని..వారు నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారని చెబుతున్నారు. కొత్తగా ఇన్చార్జ్ పదవులు పొందిన వాళ్లంతా… అభ్యర్థిత్వం పొందుతారని.. అందులో ఎలాంటి సందేహంలేదని.. పక్కన పెట్టిన సీనియర్లు, సన్నిహితులకు.. ‌అవకాశం లేదని చెబుతున్నారు. ఇక అభ్యర్థులను ప్రకటించడమే తరువాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close