షర్మిల ఇన్విటేషన్ : జగన్ పరిశీలన – చంద్రబాబు భరోసా

వైఎస్ షర్మిల తన కుమారుడి పెళ్లికి రావాలని అందర్నీ పిలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ కనీసం పలకరింపులు కూడా ఉండని నేతల్ని వెళ్లి కలుస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనను కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఇరవై నిమిషాల సేపు మాట్లాడారు. వైఎస్ తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల తెలిపారు. రాజకీయాలు మాట్లాడలేదన్నారు. తప్పనిసరిగా పెళ్లికి వస్తానని చెప్పారన్నారు.

చంద్రబాబుతో భేటీ సందర్భంగా షర్మిల పసుపు కలర్ బోకేను తెచ్చి ఇచ్చారు. బయట మీడియాతో మాట్లాడినప్పుడు చంద్రబాబు రాజకీయంగా ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదన్నారు. ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉండాలని చెప్పుకొచ్చారు. నిజానికి షర్మిలకు ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు చెబుతున్నారుక కానీ.. జగన్ రెడ్ిడ చేసేదంతా కక్ష సాధింపు రాజకీయాలే్. అవి ఆమె మీదకు వచ్చే సరికి.. ఫ్రెండ్లీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారన్న విమర్శలు సహజంగానే వస్తాయి. అయితే ఇప్పుడు షర్మిలతో ఎవరికీ పంచాయతీ లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ బాధ్యతలు చేపడతారో స్పష్టత లేదు.

కానీ జగన్మోహన్ రెడ్డిని పిలిచినప్పుడు ఒక్క ఫోటో కానీ వీడియో కానీ బయటకు రాలేదు. అసలు జగన్ కలిశారా లేదా అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఆహ్వానపత్రిక అందించానని సానుకూలంగా స్పందించారని మాత్రం షర్మిల తెలిపారు. ఏదో సమ్మె చేస్తున్న కార్మికులకు భరోసా ఇచ్చినట్లుగా సానుకూలంగా స్పందించడం ఏమిటన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. వచ్చాయి కూడా. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ విషయంలో ఫోటోలు, వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి. చంద్రబాబు ఇంటి బయట మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడి పెళ్లికి వస్తానని చెప్పారన్నారు.

షర్మిల కుమారుడి పెళ్లి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. పెళ్లికి జగన్ వెళ్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో నాలుగు రోజుల్లో నిశ్చితార్థం జరగనుంది. దానికి జగన్ హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close