ఏపీ మంత్రిని భయపెట్టిన “పంజాబ్ సీన్”..వెంటనే సారీ..!

పంజాబ్‌లో రైతు చట్టాలను సమర్థిస్తూ.. రైతులకను కించ పరుస్తూ మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యేను రైతులు వెంటపడి కొట్టారు. బట్టలన్నీ చింపేసి కొట్టారు. పోలీసులు ఆయనను కాపాడలేకపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖచ్చితంగా ఇది వైరల్ అవుతున్న సమయంలోనే ఏపీ మంత్రి ఒకరు రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనే రంగనాథరాజు. వరి పండించడం అంటే సోమరిపోతు వ్యవసాయం అని.. ఆ పంట వేసే వాళ్లందరూ సోమరిపోతులేనన్నట్లుగా మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఓ వైపు పంజాబ్‌లో ఎమ్మెల్యేని చితక్కొట్టిన వార్తలు.. మరో వైపు ఏపీ మంత్రి రైతులను కించ పరిచేలా చేసిన వ్యాఖ్యలను కంపేర్ చేసి.. షేర్ చేయడం ప్రారంభించారు. మరో వైపు రైతు సంఘాలు రోడ్డెక్కాయి. రంగనాథరాజు అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని… ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
విపక్ష పార్టీలు కూడా.. మంత్రి రంగనాథరాజు రైతులపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. వరి సోమరిపోతు వ్యవసాయమని మంత్రి మాట్లాడటం సిగ్గుచేటని…రైతులకు క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వివాదం అంతకకూ పెరిగిపోతూండటంతో తిరుపతిలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన రంగనాథరాజు హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. క్షమాపణలు చెప్పారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. రైతుల్ని క్షమించాలని వేడుకున్నారు. అయితే ఆయనను కేబినెట్ నుంచి తొలగించి.. ముఖ్యమంత్రి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close