రేవంత్ రెడ్డి వింత డిమాండ్!

తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా విచిత్రమయిన డిమాండ్ చేసారు. ఈరోజు ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “వరంగల్ ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల ఎన్నికల ఖర్చుపై ఎన్నికల సంఘం పరిమితి విధించినప్పటికీ దానిని తెరాస అసలు పట్టించుకోవడం లేదు. ఆ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అభ్యర్ధికి ఎన్నికలలో లబ్ది చేకూర్చే విధంగా వార్తల రూపంలో ప్రచారం జరుగుతోంది. వాటన్నిటినీ పెయిడ్ ఆర్టికల్స్ గానే పరిగణించాలి. వాటికయ్యే ఖర్చును లెక్క వేస్తే ఇంచుమించుగా పది కోట్లు పైనే ఉంటుంది. ఎన్నికల సంఘం విధించిన పరిమితి కంటే అది చాలా ఎక్కువగా ఉంది. అభ్యర్ధులు పరిమితికి మించి ఖర్చు చేసినట్లయితే తగు చర్యలు తీసుకొంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అయినా దానిని తెరాస పట్టించుకోకుండా మీడియాలో విచ్చలవిడిగా తన అభ్యర్ధికి అనుకూలంగా వార్తలు ప్రచురింపజేసుకొంటోంది. అయినా కూడ ఎన్నికల సంఘం తెరాస అభ్యర్ధికి, ప్రభుత్వానికి ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదో మాకు అర్ధం కావడం లేదు. ఆ ఆర్టికల్స్ అన్నిటినీ పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించి, తెరాస అభ్యర్ధిని ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వరంగల్ లో ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారికి, జిల్లా, రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకి దీని గురించి పిర్యాదు చేస్తాము,” అని అన్నారు.

మీడియాలో తెరాసకు కొన్ని అనుకూలంగా ఉన్నట్లే, తెదేపాకు, బీజేపీకి,వామపక్షాలకు, చివరికి మజ్లీస్ పార్టీకి కూడా ఉన్నాయి. వాటిలో ఆయా పార్టీలకి అనుకూలంగానే వార్తలు వస్తుంటాయి. రేవంత్ రెడ్డి వాదన ప్రకారం మీడియాలో వచ్చే వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించి దానిని అభ్యర్ధుల ఖర్చుగా లెక్కించే మాటయితే, ఎన్నికలకు సంబంధించి ఏ వార్తలు వేయాలన్నా మీడియా ఆలోచించుకోవలసి ఉంటుంది. అలాగే అప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న అందరు అభ్యర్ధులపై కూడా అనర్హత వేటు వేయవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close