జగన్ ఫెయిల్యూర్‌ను క్యాష్ చేసుకోలేకపోతున్న టీడీపీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఢీ అంటే ఢీ అన్నట్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఊపిరి సలపకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఒక్కోసారి పైచేయి సాధిస్తోందికూడా. గత అసెంబ్లీ సమావేశాలలో ఆద్యంతం ప్రతిపక్షానిదే పైచేయి అని స్పష్టంగా కనబడింది. ఈ విషయంలో జగన్ వ్యూహాన్ని అభినందించక తప్పదు. అయితే ఇప్పుడు జగన్ పక్షంలో ఒక మంచి బలహీనత దొరికినపుడు దానిని అందిపుచ్చుకునే అవకాశాన్ని తెలుగుదేశం నేతలు జారవిడుచుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీపరంగా కొంతకాలంగా బాగా వెనకబడి ఉందని, వారి మంత్రాంగం లోపభూయిష్టంగా ఉందని విమర్శలు వినబడుతున్న సంగతి తెలిసిందే. దానికి మరో నిదర్శనం తాజాగా బయటపడింది. ప్రత్యేకహోదాకోసం జగన్ నిరాహారదీక్ష తుస్సుమన్న సంగతి విదితమే. జగన్ ఏ లక్ష్యంతో ఈ దీక్షను చేశారో, దానిలో ఎంతమేరకు సఫలీకృతులయ్యారో ఆయనకే తెలియని పరిస్థితి ఉంది. క్లైమాక్స్‌కు చేరకముందే హర్ట్ రిటైర్ అయ్యి పెవిలియన్ దారిపట్టినట్లుగా దీక్ష ముగిసింది. ప్రజలలో స్పందన లేకపోవటంవలన ముగించారని కొందరు, ఇంకొన్నిరోజులు దీక్షను కొనసాగిస్తే టెంపో పెరిగి ప్రజలలో స్పందన వచ్చేదని కొందరు, ప్రాణభయంతో ప్రభుత్వానికి సహకరించాడని మరికొందరు – దీక్షపై రకరకాలుగా వాదనలు చేస్తున్నారు. ఏది ఏమైనా దీక్ష అనేది వైసీపీకి అడ్వాంటేజ్ కాకపోగా ఫెయిల్యూర్‌గా తేలింది. వైసీపీకి పలు ప్రధానాంశాలపై స్పష్టమైన వ్యూహం లేదనే విషయం మళ్ళీ రుజువయింది. శత్రువులో ఇంత మంచి బలహీనత దొరికితే దానిని పట్టుకుని దెబ్బకొట్టాల్సిన తెలుగుదేశం దీనిపై ఒక్కమాటకూడా స్పందించలేదు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఆలోచనేగానీ సమస్యలపై పరిష్కారంపట్ల చిత్తశుద్ధి లేదని ప్రజలలో ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయటంలేదు. ఎలాగోలా దీక్ష ముగిసి సమస్య పరిష్కారమైపోయిందని టీడీపీ నేతలు సంబరంలో మునిగిపోయినట్లుగా కనబడుతోంది.

మామూలుగా అయితే ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రోజుకు రెండు, మూడు ప్రెస్‌మీట్‌లు పెట్టి జగన్‌పై విమర్శలు గుప్పించే గాలి, సోమిరెడ్డి జగన్ దీక్ష ఫెయిల్యూర్‌పై నోరు మెదపలేదు. అటు దూకుడుగా కనిపించే పయ్యావుల, ఉమాకూడా స్పందించకపోవటం విశేషం. అంటే దీనిపై వారికి దిశా నిర్దేశం చేయాల్సిన ఒక కేంద్రీకృత వ్యవస్థ, థింక్ ట్యాంక్ సరిగా లేదని అర్థమవుతోంది. ఇప్పటికైనా ఆ లోపాన్ని సరిచూసుకోకపోతే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలలో మాత్రమే పై చేయిగా ఉన్న జగన్ – వచ్చే ఎన్నికలలోకూడా పైచేయి సాధించటం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close