అత్యంత స్వచ్ఛనగరం మైసూరు, విశాఖకు 5వ స్థానం

హైదరాబాద్: దేశంలోని నగరాలన్నింటిలో మైసూరు అత్యంత స్వచ్ఛమైనదిగా, ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోని వారణాసి నగరం అత్యంత మురికి నగరాలలో ఒకటిగా తేలాయి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ జరిపిన సర్వే ఫలితాలను మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ ఢిల్లీలో ప్రకటించారు. పదిలక్షలకు పైగా జనాభా ఉన్న 73 నగరాలలో ఈ సర్వేను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరానికి 5వ స్థానం దక్కింది. 2014లో జరిపిన ఇదే సర్వేలో కూడా మైసూరు నగరమే ప్రథమ స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ ఏటి అత్యంత మురికి నగరంగా జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరం ఎంపికయింది. పది అత్యంత మురికి నగరాలలో ఉత్తర ప్రదేశ్‌లోనివే మూడు నగరాలు(వారణాసి, మీరట్, ఘజియాబాద్) ఉండటం విశేషం. స్వఛ్ఛ భారత్ మిషన్ ప్రభావం తెలుసుకోవటానికి ఈ సర్వే జరుపుతున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. సర్వేల వలన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై అవగాహన కూడా పెరుగుతుందని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close