అత్యంత స్వచ్ఛనగరం మైసూరు, విశాఖకు 5వ స్థానం

హైదరాబాద్: దేశంలోని నగరాలన్నింటిలో మైసూరు అత్యంత స్వచ్ఛమైనదిగా, ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోని వారణాసి నగరం అత్యంత మురికి నగరాలలో ఒకటిగా తేలాయి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ జరిపిన సర్వే ఫలితాలను మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ ఢిల్లీలో ప్రకటించారు. పదిలక్షలకు పైగా జనాభా ఉన్న 73 నగరాలలో ఈ సర్వేను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరానికి 5వ స్థానం దక్కింది. 2014లో జరిపిన ఇదే సర్వేలో కూడా మైసూరు నగరమే ప్రథమ స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ ఏటి అత్యంత మురికి నగరంగా జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరం ఎంపికయింది. పది అత్యంత మురికి నగరాలలో ఉత్తర ప్రదేశ్‌లోనివే మూడు నగరాలు(వారణాసి, మీరట్, ఘజియాబాద్) ఉండటం విశేషం. స్వఛ్ఛ భారత్ మిషన్ ప్రభావం తెలుసుకోవటానికి ఈ సర్వే జరుపుతున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. సర్వేల వలన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై అవగాహన కూడా పెరుగుతుందని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close