వెట‌ర‌న్ భామ‌ల‌కూ… డిమాండ్‌!

చిత్ర‌సీమ‌కు జ్ఞాప‌క‌శ‌క్తి చాలా త‌క్కువ‌. ట‌చ్ లో లేకుండా పోతే… అంతా మ‌ర్చిపోతారు. అందుకే తార‌లంతా చిన్న‌దో, పెద్ద‌దో ఏదో ఓ సినిమా చేస్తూ.. `మేం కూడా ఉన్నాం` అని చెప్పుకోవాల్సిందే. అయితే ఈ గ్యాప్ మ‌రీ ఎక్కువైతే ఆ చిన్న అవ‌కాశం కూడా ఉండ‌దు. మ‌రీ ముఖ్యంగా క‌థానాయిక‌ల‌కు. అయితే.. ఈ సీజ‌న్‌లో మాత్రం కొంత‌మంది వెట‌ర‌న్ క‌థానాయిక‌లు తెలుగు తెర‌పై మ‌ళ్లీ క‌నిపించ‌బోతున్నారు. వాళ్లు అవ‌కాశాల్ని వెదుక్కుంటూ రావ‌డం కంటే, వాళ్లనే అవ‌కాశాలు వెదుక్కుంటూ వెళ్ల‌డం… ఈసారి చెప్పుకోద‌గిన పెద్ద విష‌యం.

పెళ్ల‌య్యాక‌… క‌ల‌ర్ స్వాతి ఇక సినిమాల్లో న‌టించ‌దు అనుకున్నారు. కానీ.. ఇప్పుడు `కార్తికేయ 2`లో త‌ను న‌టిస్తోంది. ఈ సినిమాలో అనుప‌ర ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన నాయిక‌. అయితే `కార్తికేయ`లో క‌నిపించిన స్వాతి…. పార్ట్ 2లోనూ ఉండాల‌ని ద‌ర్శ‌కుడు భావించ‌డంతో స్వాతిని ఈ సినిమాలో ఏరి కోరి తీసుకోవాల్సివ‌చ్చింది. ఇప్పుడు త‌న‌కు ఓ వెబ్ సిరీస్ ఆఫ‌ర్ కూడా వ‌చ్చింద‌ట‌. మ‌రోవైపు `ఆవ‌కాయ్ బిర్యానీ` హీరోయిన్ బిందు మాధ‌వి మ‌రోసారి ట‌చ్‌లోకి వ‌చ్చింది. సినిమా బండి ఫేమ్ వికాస్ వ‌శిష్ట క‌థానాయ‌కుడిగా రూపొందే ఓ సినిమాలో… బిందు మాధ‌వి హీరోయిన్‌. ఇక టాలీవుడ్ కి అప్పుడ‌ప్పుడూ ట‌చ్‌లో ఉండే అంజ‌లి.. ఇప్పుడు ఓ భారీ ఆఫ‌ర్ ని ప‌ట్టేసింది. రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందించే సినిమాలో అంజ‌లిది కీల‌క పాత్ర‌. ర‌విబాబు సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ‌… `అఖండ‌`లో కీల‌క పాత్ర పోషిస్తోంది. త‌న కోసం కొన్ని లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లు సిద్ధం అవుతున్నాయి. `బ్యాక్ డోర్‌` అనే సినిమా విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఇలా… వెట‌ర‌న్ ముద్ర ప‌డిపోయిన క‌థానాయిక‌ల‌కు ఇప్పుడు కొత్త‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మున్ముందు ఈ జాబితాలో ఇంకెంత‌మంది చేర‌తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close