బాల‌య్య‌కు చిరు ఫోన్‌

రేపు అంటే… మంగ‌ళ‌వారం టాలీవుడ్ లో కీల‌క‌మైన స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో చిరు అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ మీటింగ్ పై అంద‌రి దృష్టీ ప‌డింది. ఈ స‌మావేశంలో టాలీవుడ్ లోని పెద్ద త‌ల‌కాయ‌లంతా పాల్గొన‌బోతున్నారు. అందుకోసం చిరు సైతం.. ఓ అడుగు ముందుకేశారు. చిత్ర‌సీమ‌లో ప్ర‌ముఖుల్ని ఆయ‌నే స్వ‌యంగా ఫోన్ చేసి, స‌మావేశానికి రావ‌ల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా.. బాల‌కృష్ణ‌, నాగార్జున‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ ల‌కు సైతం.. చిరు నుంచి ఫోన్ వెళ్లింద‌ని తెలుస్తోంది. ఈ స‌మావేశంలో నాగార్జున‌, దిల్ రాజు, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, అశ్వ‌నీద‌త్‌, సురేష్ బాబు, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, నిరంజ‌న్ రెడ్డి, ఏసియ‌న్ సునీల్ త‌దిత‌రులంతా పాల్గొన‌బోతున్నారు.

బీ,సీ సెంట‌ర్ల‌లో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు, 5వ ఆట‌కు అనుమ‌తి, భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు తొలి రెండు వారాల్లో టికెట్ రేట్లు పెంచుకునేలా అనుమ‌తులు తీసుకురావ‌డం… ఇలా ప‌లుకీల‌క‌మైన అంశాల‌ను ప్ర‌ధాన ఎజెండాగా తీసుకుని ఈ మీటింగ్ నిర్వ‌హించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో టాలీవుడ్ ప్ర‌ముఖులు స‌మావేశం కాబోతున్నార‌ని, ఆ మీటింగ్ లో ఏయే విష‌యాల‌ను ప్ర‌స్తావించాలి? అనే అంశం మీద‌.. ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. బాల‌య్య‌, నాగ్‌, మ‌హేష్… ఇలా అగ్ర హీరోలంతా క‌లిసి, ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి, ఒకే గొంతు వినిపిస్తే.. ఈ స‌మ‌స్య‌లు తీర‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close