మాజీ పిఎం మనవడితో డ్యాన్స్ చేయనున్న శృతిహాసన్?

బెల్లం కొండ శ్రీను, అక్కినేని అఖిల్‌ల మొదటి సినిమాల స్థాయిని దాటి 70కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఓ కొత్త కుర్రాడు తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి చాలా వార్తలే వినిపిస్తున్నాయి. బాహుబలి, భజరంగీ భైజాన్ సినిమాలకు కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండడంతో ఆ పాయింట్‌ని చెప్పుకునే సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు నిర్మాతలు. బాలకృష్ణతో మిత్రుడు సినిమాను రూపొందించిన మహేదేవన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్‌కి, జాగ్వార్ అన్న టైటిల్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది కానీ ఈ సినిమాను వార్తల్లో నిలపడంలో మాత్రం ప్రొ్డ్యూసర్స్ సక్సెస్ అవుతున్నారు.

ఈ సినిమాకు పబ్లిసిటీ విషయంలో హెల్పవ్వడానికి, కుమారస్వామి కొడుకు సినిమా గురించి చెప్పడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తెలుగు, తమిళ్‌లలో సూపర్ క్రేజ్ ఉన్న శృతీహాసన్ చేత ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయించనున్నారట. శృతీహాసన్‌ని అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్స్ అదిరిపోయే అమౌంట్‌ని ఆఫర్ చేశారట. ఎలా అయినా తన కొడుకు సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న కుమారస్వామి ఇప్పుడు శృతీహాసన్‌ని ఒఫ్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయడానికి శృతీ సై అంటే మాత్రం ‘జాగ్వార్’ సినిమాకి ఎంతో కొంత ఓపెనింగ్స్ అయితే బాగానే ఉండే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close