బెల్లం కొండ శ్రీను, అక్కినేని అఖిల్ల మొదటి సినిమాల స్థాయిని దాటి 70కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఓ కొత్త కుర్రాడు తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి చాలా వార్తలే వినిపిస్తున్నాయి. బాహుబలి, భజరంగీ భైజాన్ సినిమాలకు కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండడంతో ఆ పాయింట్ని చెప్పుకునే సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు నిర్మాతలు. బాలకృష్ణతో మిత్రుడు సినిమాను రూపొందించిన మహేదేవన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్కి, జాగ్వార్ అన్న టైటిల్కి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది కానీ ఈ సినిమాను వార్తల్లో నిలపడంలో మాత్రం ప్రొ్డ్యూసర్స్ సక్సెస్ అవుతున్నారు.
ఈ సినిమాకు పబ్లిసిటీ విషయంలో హెల్పవ్వడానికి, కుమారస్వామి కొడుకు సినిమా గురించి చెప్పడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తెలుగు, తమిళ్లలో సూపర్ క్రేజ్ ఉన్న శృతీహాసన్ చేత ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయించనున్నారట. శృతీహాసన్ని అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్స్ అదిరిపోయే అమౌంట్ని ఆఫర్ చేశారట. ఎలా అయినా తన కొడుకు సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న కుమారస్వామి ఇప్పుడు శృతీహాసన్ని ఒఫ్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ చేయడానికి శృతీ సై అంటే మాత్రం ‘జాగ్వార్’ సినిమాకి ఎంతో కొంత ఓపెనింగ్స్ అయితే బాగానే ఉండే అవకాశం ఉంది.