ధృవ మూవీ…ఆ క్యారెక్టర్ అదిరిపోతుందంతే

థనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయాలని రామ్ చరణ్ డిసైడ్ అయిన మరుక్షణం నుంచి కూడా విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. థనీ ఒరువన్ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అవడంతో పాటు, రెగ్యులర్ మసాలాలు లేకుండా పూర్తిగా కాన్సెప్ట్‌నే నమ్ముకుని తెరకెక్కించిన సినిమా కావడమే దానికి ప్రధాన కారణం. తమిళ్‌లో యాక్ట్ చేసిన హీరోకి రామ్ చరణ్ అంత మాస్ ఇమేజ్ లేదు. సినిమా అంతా కూడా విలన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్‌తో రొమాన్స్‌కి స్కోప్ లేదు. అలాగే కేవలం రెండు మూడు సాంగ్స్‌తోనే సరిపెట్టాల్సిన కథ. ఇప్పటి వరకూ ఆరెంజ్ మినహా అన్నీ మాస్ మసాలా సినిమాలే చేసిన రామ్ చరణ్ సడన్‌గా థనీ ఒరువన్ లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యేసరికి అనుమానాలే ఎక్కువగా జెనరేట్ అవుతున్నాయి.

ఆ అనుమానాలకు తెరదించుతూ ఓ మాంచి కమర్షియల్ పాయింట్‌కి సంబంధించిన న్యూస్ అయితే బయటకు వచ్చింది. కాన్సెప్ట్‌ని డిస్టర్బ్ చేయకుండా తెలుగులో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలిసింది. అలాంటి ఓ మార్పుకు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. థనీ ఒరువన్ సినిమాలో హిలేరియస్ కామెడీ క్యారెక్టర్ ఒకటి ఉంది. అరవింద్ స్వామి తండ్రి పాత్ర అది. ధృవ టీం అందరూ కలిసి ఆ క్యారెక్టర్‌ని బాగా డెవలప్ చేశారట. సొంత బుర్రను అస్సలు వాడకుండా కొడుకు అయిన అరవింద్ స్వామి ఎలా చెప్తే అలా గుడ్డిగా చేసుకుంటూ పోయే క్యారెక్టర్ అది. సినిమా మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క కామెడీ క్యారెక్టర్ కూడా అదే. ఇప్పుడు ఆ కేబినెట్ మంత్రి క్యారెక్టర్‌ని పోసాని కృష్ణమురళి చేత చేయిస్తున్నారు. ఆల్రెడీ ఈ క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ కొన్ని షూట్ చేశారు. ఫైనల్ రష్ చూసుకున్న చరణ్‌తో సహా యూనిట్ మొత్తం కూడా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారట. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘నాయక్’ సినిమా విజయంలో పోసాని కామెడీ చాలా చాలా కీ రోల్ ప్లే చేసింది. ఈ సారి అంతకుమించిన కామెడీనే ‘ధృవ’లో ఉండబోతోంది. పోసాని కామెడీ క్యారెక్టర్ ధృవ సినిమాకు చాలా చాలా హెల్ప్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close