ఐటీ గ్రిడ్‌పై ఆధార్ కేసు…! కేసు నిలబెట్టడానికి ఇదైనా సరిపోతుందా..?

ఐటీ గ్రిడ్ కేసులో.. ఆధార్ రీజనల్ అధికారులు ఫిర్యాదులు చేశారంటూ.. హైదరాబాద్ పోలీసులు హడావుడిగా ఓ కేసు నమోదు చేసి.. దాన్ని స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్‌కు బదిలీ చేసేశారు. దాంతో.. మళ్లీ మీడియా చానళ్లకు… పోలీసు వర్గాలు లీకులు ప్రారంభించాయి. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం ప్రత్యేకబృందాలు గాలిస్తున్నాయంటూ ఆ లీకుల సారాంశం. నిజానికి.. కేసు నమోదయినప్పటి నుంచి పోలీసులు అశోక్ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడున్నాడో కనిపెట్టేశామని.. వెళ్లి పట్టుకొచ్చేయడమేనని… మీడియాకు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ తీసుకు రాలేదు. కానీ.. అశోక్ రాజకీయ కుట్ర అంటూ.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో… పరిస్థితి సంక్లిష్టంగా మారింది.

అసలు..ఈ కేసు మొదటగా.. ఏపీ ప్రభుత్వ డేటా చోరీ అంటూ ప్రారంభించారు. ఓటర్ల జాబితా… ఐటీ గ్రిడ్ నిర్వహిస్తున్న టీడీపీ యాప్ సేవామిత్రలో ఉందని.. లబ్దిదారుల జాబితా ఉందని.. అదంతా ఏపీ ప్రభుత్వ అధికారిక సమాచారం అన్ని దాన్ని చోరీ చేశారని.. చెప్పుకొచ్చారు. జగన్ బంధువు .. ఫిర్యాదు చేయడంతో.. ఆయనకు విజిల్ బ్లోయర్ అనేహోదా ఇచ్చి… కేసు నమోదు చేసి.. ఐటీ గ్రిడ్ ఆఫీసు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కార్యకలాపాల్ని నిలిపివేశారు. కంప్యూటరన్నీ పట్టుకుపోయారు. భవనాన్ని కూడా సీజ్ చేశారు. కానీ.. ఓటర్ల జాబితా పబ్లిక్ డొమైన్‌లో ఉన్నదేనని.. ఈసీ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి అదే సమాధానం వచ్చింది. దాంతో.. ఈ కేసులో పస లేదని.. ఈ సారి ఆధార్ వైపు నుంచి తీసుకొచ్చారు. ఆధార్ అధికారులు ఫిర్యాదులు చేశారని… కొత్త కేసు నమోదు చేశారు.

ఆధార్ సమాచారం… దొంగిలించలేరు అనేది.. ఆ సంస్థ ఇచ్చిన అధికారిక పత్రం. కానీ… వారిచ్చిన ఫిర్యాదులో ఏముందంటే… తమ దగ్గర ఉండాల్సిన సమాచారం… ఐటీ గ్రిడ్ వద్ద ఉందన్నది.. వారి ఫిర్యాదు. ఏదో విధంగా ఐటీ గ్రిడ్‌ను.. కేసులో ఉంచకపోతే… తాము ఇరుక్కుపోతామని… పడుతున్న కంగారులో భాగంగానే ఈ ఫిర్యాదు వచ్చిందని ఎవరికైనా తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. స్వచ్చందంగా ఇచ్చిన ఆధార్ వివరాలను… చూపి.. తమ దగ్గర ఉండాల్సిన సమాచారం.. వారి దగ్గర ఉందంటూ… ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ వేసిన క్వాష్ పిటిషన్ పై.. విచారణ ఈ నెల ఇరవైన మరోసారి విచారణకు రానుంది. ఈ లోపే… కొత్తగా ఆధార్ కేసు నమోదు చేయడం… అశోక్ కోసం వెదుకులాట అంటూ మళ్లీ హడావుడి ప్రారంభించడంతో.. పోలీసుల తీరుపై.. అనేక అనుమానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close