దేశం వదిలివెళ్ళే ఆలోచన లేదు: ఆమిర్ ఖాన్ వివరణ

హైదరాబాద్: ఆమిర్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత అసహనంపై మళ్ళీ చర్చకు దారితీయటమేకాక, పెద్ద రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియాలో మత అసహనం పెరిగిపోతోందని, ఇక్కడనుంచి వెళ్ళిపోదామని తన భార్య కిరణ్ సూచించిందంటూ ఆ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకుగానూ ఆమీర్ ఖాన్ ఇవాళ వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా తన వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతుండంతో ఇవాళ ఆమిర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తనకుగానీ, తన భార్యకుగానీ ఇండియా వదిలివెళ్ళే ఆలోచన లేదని చెప్పారు. ఇండియా వదిలి వెళ్ళాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పలేదని, అలా భావించేవారు తన ఇంటర్వ్యూను పూర్తిగా చూసి ఉండకపోవటం గానీ, కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించటంగానీ చేస్తూ ఉండి ఉండొచ్చని అన్నారు. మొన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరించారు. భారతదేశం తన జన్మభూమి అని, ఇండియాను ప్రేమిస్తానని, ఇక్కడ పుట్టటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. భారతీయుడు అయినందుకు గర్వపడుతున్నానని తనను దేశ వ్యతిరేకిగా పిలిచే వారందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. దీనికిగానూ తనకు ఎవరి అనుమతి, సమర్థన అవసరంలేదని చెప్పారు.

ఈ వివాదం విషయంలో తనకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలుపుతూ, భారతదేశం యొక్క సమగ్రత, వైవిధ్యం, సంస్కృతి, భాషలు, చరిత్ర, సహనం, ప్రేమ, భావోద్వేగ బలాలను అందరం కాపాడుకోవాలని అన్నారు. చివరిగా, ‘వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్’ అనే రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉటంకించి జైహింద్ అంటూ తన ప్రకటనను ముగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close