తెలంగాణ రాజకీయం @ ఢిల్లీ

తెలంగాణ జాతీయ పార్టీ నేతలంతా ఢిల్లీలో మకాం వేశారు. కీలక నేతలంతా హస్తినకు చేరుకుని పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. పార్టీలో చేరుతామని చెప్పేందుకు పొంగులేటి, జూపల్లి ఢిల్లీ వెళ్లారు. వారితో పాటు రాహుల్ తో సమావేశానికి సీనియర్లు అందర్నీ ఆహ్వానించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా నేతలంతా ఏఐసీసీ కార్యాలయంకు వెళ్లారు. వారితో రాహుల్ అరగంట పాటు భేటీ నిర్వహించారు. ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.

మరో వైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. శనివారం వారిని బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, నడ్డా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ ఢిల్లీలోనే ఉండిపోయారు. వీరి అంశంపై హైకమాండ్ .. బండిసంజయ్‌తో చర్చించే అవకాశం ఉంది.

ఎన్నికలు జగ్గర పడుతూ ఉండటంతో రెండు జాతీయ పార్టీల తెలంగాణ శాఖల్లో హడావుడి పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి పీఠం దక్కించుకోవాలని పోరాటం చేస్తున్న జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా తమ స్థానిక నేతల్ని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు అప్పగిస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తగ్గిపోతున్న ప్రాభవాన్ని నిలబెట్టుకుని చేరికల్ని ఎలా ప్రోత్సహించుకోవాలా అనిబీజేపీ మథన పడుతూండగా.. మరింతగా ఉక్కిరిబిక్కిరి చేసేలా చేరికల్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

ఎంపీ ఎన్నికలు…హైదరాబాద్ లో కర్ఫ్యూ..!!

హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close