అమరావతి ఇంప్లీడ్ పిటిషన్లు కొట్టివేత..!

అమరావతి వ్యాజ్యాల్లో తాము ఇంప్లీడ్ అవుతామంటూ దాఖలయిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. విశాఖలో నిర్మిస్తున్న స్టేట్ గెస్ట్ హౌస్ .. పరిపాలనా రాజధానిలో భాగంగానే నిర్మించారంటూ.. కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ఇంప్లీడ్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అదే సమయంలో.. స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అయిన తర్వాత హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిపాలనా రాజధానిలో భాగంగానే ఆ నిర్మాణం చేస్తున్నట్లుగా స్పష్టమైన సమాచారం ఉంటే.. పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకు రావొచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తర్వాత వాదనలు వింటామని తెలిపింది.

మూడు రాజధానులు సహా.. అమరావతికి సంబంధించి అనేక వివాదాలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి రోజువారీ విచారణను హైకోర్టు ప్రారంభించింది. ఈ సందర్భంగా పిటిషన్లంటిపై … ఒకదాని తర్వాత ఒకటి విచారణ జరుపుతోంది. ఒకే సమస్యపై ఉన్న పిటిషన్లన్నింటినీ కలిపేసింది. హైకోర్టు హైబ్రీడ్ పద్దతిలో విచారణ జరుపుతోంది. భౌతికంగా రాదల్చుకున్న న్యాయవాదులు కోర్టుకు రావొచ్చు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనాలనుకున్నవారు హైకోర్టు అనుమతితో విచారణలో పాల్గొనవచ్చు.

ప్రస్తుతం.. మూడురాజధానుల బిల్లుకు ఆమోదం పొందడం చట్ట విరుద్ధమన్న పిటిషన్ దగ్గర్నుంచి రైతుల హామీలలు, సీఆర్డీఏ చట్టం రద్దు తో పాటు .. ఇళ్ల స్థలాలవ వరకూ రాజధాని అంశానికి సంబంధించిన అనేక పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్నాయి. రాజధానిలో ఇళ్ల స్థలాల పిటిషన్‌పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది మొత్తంగా.. అమరావతి అంశం.. న్యాయవివాదాల్లో ఇరుక్కున్నట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close