ఏపీలో “ఓట్ల తొలగింపు” ఉద్యమం !

అక్కడక్కడా ఉపఎన్నికలు జరిగితే టూరిస్ట్ బస్సుల్లో ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవచ్చు.. . కానీ రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరిగితే కష్టం.. అందుకే అధికార పార్టీ కొత్త ప్రణాళిక అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే ఓట్ల తొలగింపు. ధర్మవరం నియోజకవర్గంలో కేవలం రెండు గ్రామాల్లోనే ఐదు వందల ఓట్లను తొలగించిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. గతంలో పయ్యావుల కేశవ్ నియోజకవర్గం ఉరవకొండలో ఇలాగే ఓట్లు తీసేస్తే.. మొదట అదేం లేదని బుకాయించిన అధికారులు.. కేంద్ర ఎన్నికల సంఘం నుండి ప్రతినిధి వచ్చే సరికి ఇద్దరు బీఎల్వోలను సస్పెండ్ చేశారు. అంటే ఓట్ల తొలగింపు అనేది నిజమని ఒప్పుకున్నట్లే. అలా ఒక్క చోట కాదు.. వ్యవస్థీకృతంగా జరుగుతోందని తాజాగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామాల్లో ఉపాధి లేక పనుల కోసం వలస వెళ్లడం సహజం. ఇలా వలస వెళ్లిన వారు…. కూలి పని చేసుకుని సీజన్ మారగానే గ్రామాలకు చేరుకుంటారు. వారు ఇతర చోట్ల ఇళ్లు కొనుక్కుని స్థిరపడిపోయే పరిస్థితి ఉండదు. కానీ వారి ఓట్లను టార్గెట్ చేసుకుని ప్రధానంగా తీసివేతలకు దిగుతున్నారు. దీంతో చాలా గ్రామాల్లో ఓట్ల తొలగింపు వివాదాలు ప్రారంభమవుతున్నాయి. నిజానికి ఇలాంటి వారు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకునేంత తీరిక ఉండదు. ఇతర రాజకీయ పార్టీలే ఈ జాబితాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని చోట్ల ఆయా గ్రామాల్లో ఓటర్ జాబితాల్లో తీసివేతలు సంచలనంగా మారుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ గ్రామాలను యూనిట్ గా తీసుకుని ఓటర్ జాబితాల పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్తగా చేర్చిన ఓటర్లు ఎవరు.. తీసేసిన ఓటర్లు ఎవరు అన్నది గ్రామాల వారీగా లెక్కలు తీస్తే… న్యాయపోరాటం చేయడానికి అవకాశం ఉంటుదన్న వాదన వినిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ 7 పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు వైసీపీ నేతలే ప్రయత్నం చేశారు. ఆ కేసు సంచలనం అయింది. కానీ వైసీపీ మారిన తర్వాత పక్కన పెట్టారు. ఆ దరఖాస్తులు ఎక్కువగా బీహార్ నుంచి అప్ లోడ్ అయ్యాయి. ఇప్పుడు అధికారంలో ఉండగా.. కామ్ గా ఉంటారని అనుకుంటే అది టీడీపీ అమాయకత్వం అవుతుంది.

వాలంటీర్ల కు గత వారం రోజులుగా.. టీడీపీ అనుకూల ఓటర్ల ను గుర్తించడమే టాస్క్ గా ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఓట్ల తొలగింపు నిజమైతే… ప్రజాస్వామ్యం .. నియంతృత్వమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close