ఈసీ ఆదేశాలూ లైట్ – ఏపీలో ఏం జరుగుతోంది ?

ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఇక ప్రభుత్వం ఆపద్ధర్మమే. ఈసీనే సర్వం. ఈసీనే ప్రభుత్వాన్ని నడుపుతుంది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ.. నిబంధనల ఉల్లంఘన వంటి విషయాల్లో ఈసీ ఆదేశాలను సంపూర్ణంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారవర్గంపై ఉంటుంది. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏపీ కోడ్ వచ్చినా సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కనీసం పట్టించుకోవడం లేదు. విచిత్రంగా సీఎస్ కోడ్ అమలుపై సమీక్షలు చేస్తున్నారు. ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది.

సీఈవో మీనా ఆదేశించినా ఓ కలెక్టర్ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించలేదు. ఇదేమిటని అడిగితే… కింది అధికారికి చెప్పానని తనకేం తెలుసని ఆయన ఎదురు ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. సీఈవోపై ఓ కలెక్టర్ కు ఇంత గౌరవం ఉంటే.. ఇక రాష్ట్ర స్థాయిలో ఆయనను పట్టించుకునేవారు ఎవరు ఉంటారు ?. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నేతల అండదండలతో అర్థరాత్రి .. కోడ్ పేరుతో ప్రైవేటు ఆస్తులపై దాడి చేస్తున్నారు. వైసీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పెయింటింగ్‌లు పబ్లిక్ ఆస్తుల్లో ఉన్నా పట్టించుకోని వారు .. విపక్షాలకు చెందిన ప్లెక్సీలు, బ్యానర్లు ప్రైవేటు ఆస్తుల్లో ఉన్నా ఎగబడుతున్నారు.

ఇక శాంతిభద్రతల పరిస్థితి మొదట్లోనే వివాదాస్పదంగా మారింది. కోడ్ వచ్చిన మొదటి రోజే ఇద్దరు టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారు. దీనిపై పోలీసులు కేసులు పెట్టారా… నిందితుల్ని అరెస్టు చేశారా అన్నదానిపై ఎవరికీ వివరాలు తెలియవు. ఇక స్వయంగా ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం జరిగినా.. రెడ్డి ఆఫీసర్లందర్నీ.. విధులకు ఏర్పాటు చేసి.. సభపై భారీ కుట్ర జరిగినట్లుగా స్పష్టమైనా ఇంత వరకూ చర్యలు లేవు. చివరికి ఐబీ నివేదికలపై ఆధారపడాల్సి వస్తోంది.

ఎన్నికల సంఘం కాస్త మెత్తగా ఉంటే… ఏపీలో జరిగే అరాచకాల్ని ఊహించడం కష్టం. అత్యంత కఠినంగా ఉంటేనే.. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరుగుతున్నాయి. గెలవడానికి రక్తపాతం సృష్టించడానికి కూడా వెనుకాడని మైండ్ సెట్ ఉన్న రాజకీయ నేతలు ఇప్పుడు … అధికారం నిలబెట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసేలా.. నిబంధనలు అమలు జరిగేలా చూడాల్సిన ఈసీ .. ఇప్పుడు కొరడా ఝుళిపించాల్సిన సమయం వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close