అయినా మారలేదు..!  పెరిగిన అన్నదాతల ఆత్మహత్యలు..!

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలనేవి ఉండవని.. తాము ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఘనంగా చెబుతూ ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా… ఎన్ని పథకాలు అమలు చేసినా.. రైతన్నలు… తమ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యే అనుకునే పరిస్థితులు మాత్రం మారడం లేదు. గత ఏడాది కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. వారిని ఏ పథకమూ ఆదుకోలేదు. ప్రాణాలు తీసుకుంటున్న వారిలో వ్యవసాయ కూలీలు కూడా ఉన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో విడుదల చేసిన లెక్కలు… రైతుల దీన స్థితిని తెలియచేస్తున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో… రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 55 శాతం పెరిగాయి. 2018లో 664 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. 2019లో ఆ సంఖ్య 1029కి చేరింది. దేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరుగుతున్నాయి. తర్వాత స్థానం కర్ణాటకది. మూడో స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. గత ఏడాది నాలుగో స్థానంలో ఉండేది. రైతుల కష్టాలు మరింత పెరిగి.. మూడో స్థానానికి వెళ్లింది. వాస్తవానికి ఈ మరణాలు… భూమి ఉన్న రైతుల ఆత్మహత్యలవే. కౌలు తీసుకుని సాగు చేస్తున్న రైతుల ఆత్మహత్యలు లెక్కిస్తే… కర్ణాటక కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏపీకి రెండో స్థానం వస్తోంది. గతేడాది ఆత్మహత్య చేసుకున్న రైతులు, వ్యవసాయ కూలీల్లో 10 శాతం ఆంధ్రకు చెందినవారే. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే..  సొంత భూమి ఉండి సాగు చేసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 120 శాతం పెరిగింది.

తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో ఐదో స్థానంలో ఉంది. దేశం మొత్తం మీద.. ర ైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అంతకంతకూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. 2019లో దేశం మొత్తం మీద 42480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. తాము రైతులకు ఎంతో చేస్తున్నామని చెబుతోంది. ఫసల్ బీమా అని.. మరొకటి అని వేల కోట్లు కర్చుతో పథకాలు అమలు చేస్తున్నామని చెబుతోంది కానీ. రైతుల జీవితాలు మాత్రం బాగుపడటం లేదని తేలుతోంది. రైతులకు కావాల్సింది పథకాలు కాదని.. గిట్టుబాటు ధర అనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ.. ప్రభుత్వాలు.. ఎంతో కొంత నగదు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి కానీ.. మౌలికమైన సమస్యను తీర్చడానికి మాత్రం..ముందుకు రావడం లేదు. దాంతో సమస్య అంతకంతకూ తీవ్రమవుతోంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close