టీటీడీ బోర్డులో ఆర్థిక నేరగాళ్లకు స్పెషల్ కోటా !?

జగన్ రెడ్డి ఆర్థిక నేరాల కింగ్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు.. అయితే ఆయన ఇప్పుడు ఏపీ సీఎం. అలాంటి ఆర్థిక నేరాలు చేయడం ప్రివిలేజ్ అనుకుంటున్నారో ఏమో కానీ… ప్రతిష్టాత్మక పదవుల్లో సంచలన ఆర్థిక నేరాలు చేసిన వారికి కోటా పెట్టి మరీ పదవులు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీటీడీ బోర్డులో ఆయన నియమించిన వారిని చూస్తే.. ఇది నిజమేనని అనిపించక మానదు.

తీహార్ జైలు నుంచి నేరుగా టీటీడీ బోర్డులోకి వచ్చేశారు పెనాక శరత్ చంద్రారెడ్డి. అరబిందో గ్రూపు వారసుల్లో ఒకరు అయిన ఆయన.. ఈజీ మనీ కోసం ఢిల్లీలో లిక్కర్ స్కాం చేసి పట్టుబడ్డారు. బయటపడటం కోసం జగన్ రెడ్డి చేసిన లాబీయింగ్ లో భాగంగా అప్రూవర్ గా మారి…. బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన టీటీడీ బోర్డు మెంబర్. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా.

అంతే కాదు.. టీటీడీ బోర్డులో ఉన్న మరో పేరు కేతన్ దేశాయ్.. దేశంలోవైద్య విద్యను సంస్కరించాల్సిన భారత వైద్య మండలికి చైర్మన్‌గా ఉండి… ఓ కాలేజీ అనుమతి కోసం రూ . రెండు కోట్లు లంచం తీసుకుంటూ నేరుగా దొరికిపోయిన ఘన చరిత్ర. ఇలా ఒక సారి కాదు.. రెండు సార్లు పదవులు పోగొట్టుకున్నారు. రెండు సార్లూ అవినీతి ఆరోపణల కారణంగానే. చాలా రోజులు జైల్లో ఉన్నారు. ఇప్పుడీయన హఠాత్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో శాశ్వత సభ్యుడయ్యారు. ప్రతీ సారి కొనసాగింపు ఇస్తున్నారు

అంతే కాదు బోర్డులో నియమించిన ఇతరులపైనా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వారి గురించిన వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు హైదరాబాద్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని నియమించారు. ఆయన ప్రీలాంచ్ ఆఫర్లతో జనాలకు మూడు, నాలుగు వేల కోట్లు కొట్టేసి… సైలెంట్ అయిపోయారు. ఆయన స్థానంలో వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను తీసుకున్నారు . ఆయనకు పొడిగింపు ఇవ్వలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close