త్రిష వెళ్లిపోవ‌డం వెనుక మ‌రో కార‌ణం ఉందా?

`ఆచార్య‌` నుంచి త్రిష వెళ్లిపోవ‌డం ఇప్ప‌టికీ హాట్ టాపిక్కే. మ‌ణిర‌త్నం సినిమా కోస‌మే ఈ ప్రాజెక్టు నుంచి త్రిష త‌ప్పుకోవాల్సివ‌చ్చిందంటూ.. చిరంజీవి స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిఫికేష‌న్ ఇచ్చేశారు. నిజానికి చిరు స్టేట్‌మెంట్ తో త్రిష వెళ్లిపోవ‌డం వెనుక ఉన్న ఊహాగానాల‌కు తెర ప‌డాలి. కానీ విచిత్రంగా.. త్రిష ఈ సినిమా వ‌దులుకోవ‌డం వెనుక ఓ పెద్ద కార‌ణ‌మే ఉంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. చిత్ర‌బృందంలో ఓ కీల‌క‌మైన స‌భ్యుడు త్రిష‌ని బాగా ఇబ్బంది పెట్టార‌ని, దాన్ని ఎదుర్కోలేక త్రిష‌.. ఈ సినిమాకి గుడ్ బై చెప్పింద‌న్న గుస‌గుస‌లు ఇండ్ర‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

చిరంజీవి సినిమా, పైగా కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు, ఇంత‌కు మించిన క్రేజీ ప్రాజెక్టు త్రిష‌కు దొర‌క‌దు. అయినా స‌రే.. ఈ సినిమాని వ‌ద్ద‌నుకుంది త్రిష‌. నిజానికి చివ‌రి క్ష‌ణాల వ‌ర‌కూ ఎలాగోలా ఈ టీమ్ తో ప్ర‌యాణం చేయాల‌ని అనుకుంద‌ని, కానీ… ఇబ్బందులు మ‌రీ ఎక్కువ‌వ్వ‌డంతో త‌ప్పుకోవాల్సివ‌చ్చింద‌ని, అయితే… తెర వెనుక త్రిష ఎదుర్కున్న సంగ‌తి చిరంజీవికి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలీద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎగ్రిమెంట్లు అన్నీ అయిపోయాక‌, అడ్వాన్సులు కూడా తీసుకున్నాక‌, ఓ క‌థానాయిక సినిమా నుంచి త‌ప్పుకోవ‌డం అరుదైన విష‌యం. అందులోనూ ఓ పెద్ద సినిమా నుంచి. కానీ త్రిష‌కు మ‌రో మార్గం లేక‌పోయింది. మ‌ణిర‌త్నం సినిమా కోస‌మే ఆచార్య‌లో చేయ‌డం లేద‌న్న‌ది త్రిష ఎంచుకున్న సాకు. మ‌రి నిజ‌మేమి, త్రిష‌ని ఇబ్బంది పెట్టింది ఎవ‌రన్న విష‌యాలు త్రిష‌నే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close