పవన్ అడిగినా మద్దతివ్వలేదని ఫీలవుతున్న ఏపీ బీజేపీ లీడర్స్ !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ ను అడిగారట..కానీ ఆయన స్పందించలేదట. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పుకుని బాధపడుతున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్సీ మాధవ్, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం చెల్లని ఓట్ల స్థాయిలో కూడా పరపతి చూపించకపోవడంతో పరువు పోయిన అంశంపై పదాధికారుల సమావేశం పెట్టి మాట్లాడుకున్నారు. అందులో పవన్ కల్యాణ్ మద్దతివ్వకపోవడంపై ఎక్కువ ఫీలయ్యారు.

నిజంగా పవన్ మద్దతిచ్చి ఉంటే.. ఆ పొత్తుతో వచ్చే కొద్ది ఓట్లను కూడా తమ బలంగా చెప్పుకుని చెలరేగిపోయేవారు. కానీ పవన్ మద్దతిచ్చినా బీజేపీకి ఓట్లేసవారు తక్కువ. ఆ విషయం తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి బీజేపీకి వచ్చింది యాభై వేల ఓట్లు. పైగా పవన్ కూడా ప్రచారం చేశారు. ఆ ఓట్లన్నీ జనసేన, పవన్ ను చూసి వచ్చినవే. అయినా అదేదో తమ బలమని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాతైనా సేనానికి కనీస గౌరవం ఇచ్చారా అంటే ఇవ్వలేదు.

పదో ఆవిర్భావ సభలో బీజేపీ ఎలా వ్యవహరించిందో.. రాష్ట్ర నేతలు ఏం చేశారో పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. వారంతా వైసీపీకో కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయానికి అందరూ వచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మద్దతివ్వకపోవడం వల్లే తమకు ఈ ఘోరఫలితాలు వచ్చాయన్నట్లుగా మాట్లాడుతున్నారు జనసేనతో కలిస్తే ప్రభంజనం సృష్టిస్తామని మాధవ్ చెప్పుకొచ్చారు.. అలాంటి ప్రభంజనం సృష్టిస్తే జనసేన సృష్టించాలి. ఎందుకంటే.. బీజేపీకి అసలు బలంలేదని తేలిపోయింది.

కొసమెరుపేమిటంటే.. గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించడంతో గెలిచిన మాధవ్ .. ఆ తర్వాత టీడీపీని ఎన్ని మాటలన్నారో.. తాము సొంత బలంతో గెలిచామని ఎలా చెప్పుకున్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే దైర్యంతోనే ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు పవన్ మద్దతివ్వలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close