నీటి హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదు: చంద్రబాబు

తెలంగాణా ప్రభుత్వానికి ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి, మొట్టమొదటిసారిగా ఆ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు తదితర ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం మే 16 నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. దాని వెనుక ఆయన రాజకీయ ఉద్దేశ్యాలు…వాటి తక్షణ ఫలితాలు అన్నీ కళ్ళకి కట్టినట్లు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి చూస్తే, జగన్ దీక్ష ప్రకటన తరువాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా కదలిక రావడం అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రితో సహా అందరూ తెలంగాణా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, మా హక్కులను కాపాడుకొంటామని హెచ్చరించారు. కేంద్రానికి లేఖలు వ్రాసి పడేశారు. అందుకు అవతల వైపు నుంచి పులులు, సింహాలు నిద్ర లేచి గర్జించడం మొదలుపెట్టాయి. పంచాయితీలకయినా రాళ్ల యుద్ధాలకయినా రెడీ అని డిక్లేర్ చేసేసారు అవతలివాళ్ళు.

తెలంగాణా ప్రభుత్వం పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టులను ఎవరికీ తెలియకుండా, కనబడకుండా రహస్యంగా నిర్మించడం లేదు. వాటికి అనుమతులున్నాయా లేదా అనేది వేరే సంగతి. ఆ ప్రాజెక్టులను ఏవిధంగా, ఎక్కడ, ఎంత డబ్బుతో ఖర్చు చేసి నిర్మించబోతున్నామో, వాటి వలన తెలంగాణాలో ఏ ఏ ప్రాంతాలకు నీళ్ళు పారించదలచుకొన్నామో శాసనసభలో పిక్చరు వేసి మరీ వివరించారు కేసీఆర్. శాసనసభలో అలాగ సినిమా వేసి చూపించడం చూపించడం కరక్టా కాదా అనే అందరూ అప్పుడు వాదించుకొన్నారు తప్ప ఆ ప్రాజెక్టుల నిర్మించవచ్చా..కూడదా? నిర్మిస్తే దిగువనున్న ఆంధ్రాకి నష్టం కలుగుతుందా లేదా? కలిగితే తక్షణ కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించలేదు.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తను చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి అంత వివరంగా చెప్పిన తరువాత కూడా జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఎందుకు స్పందించలేదో తెలియదు. కానీ హటాత్తుగా జగన్ దీక్షకు కూర్చొంటానని ప్రకటన చేశారు. ఆ వెంటనే చంద్రబాబు కూడా స్పందించి నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రకటించేశారు. తీవ్రమయిన ఈ సమస్య పట్ల వారి ఆలోచనలు, రాజకీయాలు, ప్రతిస్పందనలు చూస్తే వారిద్దరికీ నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనే ఆసక్తి, నిబద్దత ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close