రాజధాని వివాదం కోర్టుల్లోనే ఉండేలా ఏపీ సర్కార్ స్కెచ్ !

అమరావతి ఇష్యూ ఎటూ తేలకుండా కోర్టులోనే మగ్గిపోవాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బిల్లులు రద్దు చేశామని శుక్రవారం హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసిన ప్రభుత్వం.. శనివారం హఠాత్తుగా అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో సంబంధం లేని విషయాలను జోడించింది. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని.. చెబుతూ.. శ్రీభాగ్ ఒప్పందాలను అందులో చేర్చారు. ఇది న్యాయనిపుణుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది.

హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తాము రాజధాని ఎక్కడ ఉండాలో విచారించడం లేదని ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు చట్టబద్దమా కాదా అన్నది మాత్రమే తేలుస్తామని స్పష్టం చేసింది. ఆ బిల్లులు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ విషయాన్ని హైకోర్టుకు చెబితే సరిపోయేది. అలా చెప్పింది కూడా. కానీ ఒక్క రోజుకే అనుబంధ అఫిడవిట్ దాఖలు చేయడం ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అఫిడవిట్ దాఖలకు హైకోర్టు ఇచ్చిన గడువు 26వ తేదీ వరకే. గడువులోపు అసలు అఫిడవిట్లు దాఖలు చేసి 27నొ కొసరు అఫిడవిట్ దాఖలు చేసింది ప్రభుత్వం.

బిల్లులోని అంశాలు.. మూడు రాజధానులు కాబట్టి .. అది తమ హక్కులకు భంగం కలిగిస్తోదని రైతులు ఆరోపిస్తూ కోర్టుకెళ్లారు. అదే మూడు రాజధానులు చేసి తీరుతామని హైకోర్టులో ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయడం కుట్ర పూరితమని అనుమానిస్తున్నారు. ఏ కారణంతో అయినా కోర్టు విచారణను ముగిస్తే.. మూడు రాజధానులకు హైకోర్టు అంగీకరించిందని చెప్పుకోడానికి.. లేకపోతే ఈ వివాదాన్ని అలాగే కొనసాగించడానికి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.

అఫిడవిట్‌లో శ్రీభాగ్ ఒప్పందాన్ని చేర్చడం న్యాయనిపుణుల్ని మరింత ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే శ్రీభాగ్ అనేది తెలంగాణను కలుపుతున్నప్పుడు పెట్టుకున్న పెద్ద మనుషుల ఒప్పందం. అసలు ఇప్పుడు ఏపీ ఒక్క దానికే ఆ ఒప్పందాల ప్రస్తావన తేవడం కుట్ర పూరితమేనని అంటున్నారు. సోమవారం నుంచి వీటిపై హైకోర్టులో విచారణ జరగనున్నాయి. పరిస్థితి చూస్తే ఈ వివాదం హైకోర్టులో ఇప్పుడల్లా తేలే పరిస్థితి లేదని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close