కడపలోనే పోటీ – అవినాష్ రెడ్డిపై విమర్శలతో సూచనలిచ్చిన షర్మిల !

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. షర్మిల కడప ఎంపీగా ఎన్నికల బరిలో దిగుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ అనంతరం షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తనను విమర్శిస్తున్న వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. మా కలలు పక్కన పెట్టి, మీరు ఏ కలలు కంటున్నారో చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వమని, కడప ఎంపీగా ఉండి కూడా కడప స్టీల్ ప్లాంట్ పై ఎందుకు పోరాటం చేయలేదని ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు.

షర్మిల ఇప్పటి వరకూ ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకోలేదు. అయితే పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు, నేతల్లో నూతనోత్సాహం నెలకొందని.. ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే పార్టీ పునరుజ్జీవానికి దోహదపడుతుందని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ముంబైలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ.. కడప నుంచి లోక్‌సభకు పోటీచేయాలని షర్మిలకు సూచించారు.

కడప నుంచి షర్మిల బరిలోకి దిగితే.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల వివేకా వర్థంతి సందర్భంగా రాజకీయ ప్రకటన చేస్తారని అనుకున్నా చేయలేదు. ప్రజా తీర్పు కావాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో షర్మిల పోటీ చేస్తే.. సునీత కూడా ఆమెకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సునీతకు తాను పూర్తి స్థాయిలో అండగా నిలబడతానని ఇంతకు ముందే ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close