పంజాబ్‌లో ఎమ్మెల్యేపై దాడి ..! రైతుల సహనం కంట్రోల్ తప్పుతోందా..?

రైతుల ఉద్యమాన్ని పదే పదే కించ పరిస్తే… వారు ఎప్పటిలా భూమిలా సహనంతో ఉండరని.. అవమానాలను భరించరని.. అప్పుడప్పుడు హెచ్చరికలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా పంజాబ్‌లో రైతుల అసహనం చెందితే ఏ స్థాయి ఘటనలు జరుగుతాయో… వెల్లడయింది. వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ.. రైతు ఉద్యమాలను కించ పరుస్తూ.. ప్రెస్‌మీట్‌లో అనర్ఘళంగా ప్రసంగిస్తున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేపై పంజాబ్‌లో రైతులు తిరగబడ్డారు. ముక్తసర్ జిల్లాలోని మాలోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను రైతులు కొట్టారు. బట్టలన్నీ చింపేశారు. కొట్టుకుంటూ రోడ్డుపై పరుగులు పెట్టించారు. పోలీసులు కూడా అచేతనంగా ఉండిపోయారు. అతి కష్టం మీద ఆయనను రక్షించి… ఆస్పత్రికి తరలించార.ు

అరుణ్ నారంగ్ బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి..రైతు చట్టాలకు అనుకూలం. అయితే దేశంలో ఎక్కడా లేనంత వ్యతిరేకత రైతు చట్టాలపై బీజేపీలో ఉంది. అయినప్పటికీ.. ఆయన రైతు చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాదు.. రైతు ల ఉద్యమాన్ని కించ పరుస్తున్నారు. దీంతో తన నియోజకవర్గంలో తక్కువగానే తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన తన నియోజకవర్గానికి వచ్చారని.. రైతు చట్టాలకు మద్దతుగా మీడియా సమావేశం పెట్టబోతున్నారన్న సమాచారం రైతు సంఘాలకు అందడంతో మాలోట్‌లోని బీజేపీ కార్యాలయాన్నిముట్టడించారు. పోలీసులు ఆయనను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. రైతుల చేతికి ఆయన చిక్కారు. రైతులు బీజేపీ కార్యాలయంపై దాడికి దిగి నిప్పంటించారు.

గత నవంబర్‌ నెలలో కూడా అరుణ్‌ నారంగ్‌ను రైతులు ముట్టడించి కదలకుండా చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. రైతులు బీజేపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఇతర సీనియర్‌ నేతలను ఘెరావ్‌ చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అప్పట్లో ఓయూకు వెళ్లిన నాగంపై ఇలాగే దాడి చేశారు. అయితే అంత కంటే ఎక్కువగా బట్టలు చింపేసి మరీ బీజేపీ ఎమ్మెల్యేను కొట్టారు. ఢిల్లీ శివార్లలో రైతులు ఎక్కడా కంట్రోల్ తప్పకుండా… సహనంతో పోరాటం చేస్తున్నారు.కానీ.. పంజాబ్‌లో మాత్రం పరిస్థితి మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close