అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు !

రెండో సారి విచారణకు పిలిచిన తర్వాత హైకోర్టులో సీబీఐ వేసిన ఓ కౌంటర్‌లో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఎంత పకడ్బందీగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారో తెలిసేలా సీన్ టు సీన్ వివరించారు. ఆ తర్వాత సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను ఇక అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఐదు గంటల పాటు ప్రశ్నించి ఆయనను పంపేశారు. దీంతో అరెస్ట్ ఎప్పుడు అనుకుంటూ ఆయన టెన్షన్ గా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సీబీఐ విచారణ తర్వాత బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి అసహనంగా కనిపించారు. మీడియా దుష్ప్రచారం చేస్తోందని.. విచారణలో ఉన్న కేసు విషయంలో బాధ్యతగా ఉండాలని సుద్దులు చెప్పారు. అదే సమయంలో ఆయన మాత్రం… చాలా విషయాలు మాట్లాడారు. ఓ అబద్దాన్ని సున్నా నుంచి వందకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతే కాదు సీబీఐ మీదే నిందలు వేశారు. రూ. 40 కోట్ల డీల్ అంటూ…ఏడాది కిందట టీడీపీ చేసిన ఆరోపణల్ని సీబీఐ కౌంటర్ లో వేసిందని చెప్పుకొచ్చారు. అసలు వివేకా చనిపోయే ముందు రాసిన లేఖ ఎక్కడ ఉందని.. దాన్ని బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. అవన్నీ సీబీఐ అధికారులు చూసుకుంటారనే సంగతిని మర్చిపోయారు.

మొదటి సారి విచారణ జరిగినప్పుడు కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించారు. ఆ సమయంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిల పీఏలకు ఫోన్ చేసినట్లుగా తెలిపారు. దీంతో వారినీ సీబీఐ విచారించింది. శుక్రవారం నాటి విచారణలో బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను ప్రస్తావిస్తూ అవినాష్‌ను విచారిస్తున్నరని అంటున్నారు. ఈ కేసులో అసలు సూత్రధారులెవరో తేల్చేలా కేసు విచారణ సాగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదంటున్నారు. మొత్తంగా వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close